IND VS PAK: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup, 2026) భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మధ్య జరిగే మ్యాచ్ ( Pakistan boycott) రద్దయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ మేరకు ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాతో జరిగే మ్యాచ్ ఆడబోమని వెల్లడించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీంతో ఐసీసీ తో పాటు బ్రాడ్ కాస్టర్లకు తీవ్రస్థాయిలో నష్టం జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో జియో హాట్ స్టార్ కు కూడా భారీ నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు పాకిస్తాన్ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇండియా మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరించిన నేపథ్యంలో జియో హాట్ స్టార్ కు ( jio hotstar) రూ.4200 కోట్లు నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు పాకిస్తాన్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 15వ తేదీన మ్యాచ్ కొలంబో వేదికగా జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే బంగ్లాదేశ్ పట్ల ఇండియాతో పాటు ఐసీసీ చాలా దారుణంగా వ్యవహరించిన నేపథ్యంలో… టీమిండియాతో జరిగే మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ నంగనాచి కారణాలు చెబుతోంది. అయితే అర్ధాంతరంగా ఇలా మ్యాచ్ బహిష్కరిస్తే.. ఐసీసీతో పాటు బ్రాడ్ కాస్టర్లకు కూడా తీవ్రస్థాయిలో నష్టం జరుగుతుంది.
ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు అన్నీ సేల్ అయ్యాయి. అయితే ఈ మ్యాచ్ టోర్నమెంట్ మొత్తంలో ఎక్కువ ఆదాయాన్ని తీసుకువస్తుంది. అలాంటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అయితే జియో హాట్ స్టార్ కు ఎక్కువగా నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు పాకిస్తాన్ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏకంగా 500 మిలియన్ డాలర్ల నష్టం జియో హాట్ స్టార్ కు జరుగుతుందని వార్తలు వైరల్ చేస్తున్నారు. అంటే దాదాపు 4200 కోట్లు అన్నమాట.
ఇండియాతో జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ నిజంగానే బహిష్కరిస్తే, ఐసీసీ రూల్స్ ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అప్పుల పాలు కావడం గ్యారెంటీ అంటున్నారు. అయితే 4200 కోట్ల నష్టం జరుగుతుందనేది అవాస్తవమని చెబుతున్నారు. ప్రసార హక్కులు, యాడ్స్ ధరలు, స్పాన్సర్ షిప్ టికెట్ల విక్రయాలు తదితర విభాగాలు అన్ని కలుపుకొని మొత్తం 2200 కోట్ల వరకు నష్టం జరుగుతుందని సమాచారం అందుతోంది. అయితే ఈ నష్టాన్ని మొత్తం బ్రాడ్కాస్టర్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెల్లించేలా ఐసీసీ రూల్ పెట్టిందట. అంటే రిలయన్స్ జియోకు ఎంత నష్టం వచ్చినా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అదే జరిగితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రోడ్డున పడటం గ్యారంటీ అంటున్నారు. కాగా ఈ మ్యాచ్ జరుగకపోతే పాకిస్తాన్, ఇండియా బోర్డులకు రూ.200 వరకు నష్టం జరుగుతుందని అంటున్నారు.
🚨 HUGE SET BACK FOR JIOSTAR 🚨
– Indian broadcasters are set to lose $500 million (PKR 14.1 billion) due to Pakistan's boycott of India match in T20 WC 2026. 🤯 [Geo News]
– Half of the T20 WC's revenue comes from the Pakistan-India match. pic.twitter.com/4gMt3FFCOh
— Salman. (@TsMeSalman) February 3, 2026