E-Paper
Advertisement

Suryakumar Yadav: పాండ్యాకు బిగ్ షాక్.. ముంబై కెప్టెన్ గా ఆ డేంజర్ ప్లేయర్ !

Suryakumar Yadav: పాండ్యాకు బిగ్ షాక్.. ముంబై కెప్టెన్ గా ఆ డేంజర్ ప్లేయర్ !
Advertisement

Suryakumar Yadav: ఈనెల 22వ తేదీ నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 18వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ మెగా టోర్నీలో విజేతగా నిలవాలని అన్ని ఫ్రాంచైజీలు కోరుకుంటున్నాయి. ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు తన తొలి మ్యాచ్ ని చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడబోతోంది. ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ మార్చ్ 23న జరుగుతుంది. ఇక గత సంవత్సరం తీవ్రంగా నిరాశ పరిచిన ముంబై ఇండియన్స్ జట్టు.. ఈసారి ఎలాగైనా కప్పు సాధించాలన్న పట్టుదలతో ఉంది.

 

Advertisement

అయితే ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ సీజన్ ప్రారంభానికి ముందే ఓ ఎదురు దెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ కి కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కాబోతున్నాడు. ఎందుకంటే అతడిపై ఓ మ్యాచ్ నిషేధం ఉండడమే. ఈ నిషేధం గత సీజన్ లోది కావడం గమనార్హం. గత సంవత్సరం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు మూడుసార్లు స్లో ఓవర్ రేట్ కి పాల్పడింది. దీంతో నిబంధనల ప్రకారం ఆ జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా 30 లక్షల జరిమానా ఎదుర్కోవడంతో పాటు ఓ మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు.

అయితే గత సంవత్సరం ముంబై జట్టు దారుణ వైఫల్యంతో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ప్లే ఆఫ్స్ కి దూరం కావడంతో హార్దిక్ పాండ్యా పై మ్యాచ్ నిషేధం సాధ్యం కాలేదు. దీంతో ఈ సీజన్ లో ఈనెల 23న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరగబోయే మ్యాచ్ కి హార్దిక్ పాండ్యా దూరమవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే ఈ మ్యాచ్ కి హార్దిక్ పాండ్యా దూరం కావడంతో.. ముంబై జట్టును ఎవరు నడిపించనున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Advertisement

గాయం కారణంగా పేస్ బౌలర్ జస్ ప్రీత్ బూమ్రా కూడా ఆరంభ మ్యాచ్ లకి దూరంగా ఉంటాడన్న ప్రచారం జరుగుతుంది. అయితే హార్దిక్ పాండ్యా పై వేటుపడ్డ నేపథ్యంలో తొలి మ్యాచ్ కి కెప్టెన్ గా రోహిత్ శర్మ తిరిగి జట్టు కెప్టెన్సీ బాధ్యతలను చేపడతాడా..? లేక సూర్య కుమార్ యాదవ్ కి అవకాశం కల్పిస్తారా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక సూర్య కుమార్ యాదవ్ కి టి-20 క్రికెట్ లో కెప్టెన్ గా మంచి రికార్డ్ ఉంది. సూర్య కెప్టెన్సీలో భారత జట్టు 18 మ్యాచ్లలో.. కేవలం 4 మ్యాచ్లలో మాత్రమే ఓడిపోయింది.

 

ఈ క్రమంలో సూర్య కుమార్ యాదవ్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక రోహిత్ శర్మన్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టు 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీ విజేతగా నిలిచింది. 2013, 15, 17, 19, 2020 సంవత్సరాలలో ఐదుసార్లు విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ 158 మ్యాచ్ లకి కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇందులో ముంబై జట్టు 87 మ్యాచ్లలో గెలుపొందింది. మరో 67 మ్యాచ్లలో ఓటమిని చవిచూసింది. ఇక ఐపీఎల్ 2024 కి ముందు అనూహ్యంగా రోహిత్ శర్మని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది మేనేజ్మెంట్.

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×