BigTV English
Advertisement

Suryakumar Yadav: పాండ్యాకు బిగ్ షాక్.. ముంబై కెప్టెన్ గా ఆ డేంజర్ ప్లేయర్ !

Suryakumar Yadav: పాండ్యాకు బిగ్ షాక్.. ముంబై కెప్టెన్ గా ఆ డేంజర్ ప్లేయర్ !

Suryakumar Yadav: ఈనెల 22వ తేదీ నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 18వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ మెగా టోర్నీలో విజేతగా నిలవాలని అన్ని ఫ్రాంచైజీలు కోరుకుంటున్నాయి. ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు తన తొలి మ్యాచ్ ని చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడబోతోంది. ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ మార్చ్ 23న జరుగుతుంది. ఇక గత సంవత్సరం తీవ్రంగా నిరాశ పరిచిన ముంబై ఇండియన్స్ జట్టు.. ఈసారి ఎలాగైనా కప్పు సాధించాలన్న పట్టుదలతో ఉంది.


 

అయితే ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ సీజన్ ప్రారంభానికి ముందే ఓ ఎదురు దెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ కి కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కాబోతున్నాడు. ఎందుకంటే అతడిపై ఓ మ్యాచ్ నిషేధం ఉండడమే. ఈ నిషేధం గత సీజన్ లోది కావడం గమనార్హం. గత సంవత్సరం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు మూడుసార్లు స్లో ఓవర్ రేట్ కి పాల్పడింది. దీంతో నిబంధనల ప్రకారం ఆ జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా 30 లక్షల జరిమానా ఎదుర్కోవడంతో పాటు ఓ మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు.


అయితే గత సంవత్సరం ముంబై జట్టు దారుణ వైఫల్యంతో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ప్లే ఆఫ్స్ కి దూరం కావడంతో హార్దిక్ పాండ్యా పై మ్యాచ్ నిషేధం సాధ్యం కాలేదు. దీంతో ఈ సీజన్ లో ఈనెల 23న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరగబోయే మ్యాచ్ కి హార్దిక్ పాండ్యా దూరమవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే ఈ మ్యాచ్ కి హార్దిక్ పాండ్యా దూరం కావడంతో.. ముంబై జట్టును ఎవరు నడిపించనున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

గాయం కారణంగా పేస్ బౌలర్ జస్ ప్రీత్ బూమ్రా కూడా ఆరంభ మ్యాచ్ లకి దూరంగా ఉంటాడన్న ప్రచారం జరుగుతుంది. అయితే హార్దిక్ పాండ్యా పై వేటుపడ్డ నేపథ్యంలో తొలి మ్యాచ్ కి కెప్టెన్ గా రోహిత్ శర్మ తిరిగి జట్టు కెప్టెన్సీ బాధ్యతలను చేపడతాడా..? లేక సూర్య కుమార్ యాదవ్ కి అవకాశం కల్పిస్తారా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక సూర్య కుమార్ యాదవ్ కి టి-20 క్రికెట్ లో కెప్టెన్ గా మంచి రికార్డ్ ఉంది. సూర్య కెప్టెన్సీలో భారత జట్టు 18 మ్యాచ్లలో.. కేవలం 4 మ్యాచ్లలో మాత్రమే ఓడిపోయింది.

 

ఈ క్రమంలో సూర్య కుమార్ యాదవ్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక రోహిత్ శర్మన్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టు 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీ విజేతగా నిలిచింది. 2013, 15, 17, 19, 2020 సంవత్సరాలలో ఐదుసార్లు విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ 158 మ్యాచ్ లకి కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇందులో ముంబై జట్టు 87 మ్యాచ్లలో గెలుపొందింది. మరో 67 మ్యాచ్లలో ఓటమిని చవిచూసింది. ఇక ఐపీఎల్ 2024 కి ముందు అనూహ్యంగా రోహిత్ శర్మని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది మేనేజ్మెంట్.

Related News

Hong Kong Sixes 2025: మ‌రోసారి ప‌రువు తీసుకున్న పాకిస్తాన్‌…బ‌ట్ట‌ర్‌ ఇంగ్లీష్ రాక ఇజ్జ‌త్ తీసుకున్నారు

Kranti Gaud: 2012 జాబ్ పీకేశారు, కానీ లేడీ బుమ్రా దెబ్బ‌కు తండ్రికి పోలీస్ ఉద్యోగం..ఇది క‌దా స‌క్సెస్ అంటే

MS Dhoni: ధోని ఒకే ఒక్క ఆటోగ్రాఫ్‌..రూ.3 ల‌క్ష‌లు కాస్త, రూ.30 కోట్లు ?

RCB For Sale: RCB పేరు మార్పు, ఇక‌పై ZCB…బెంగ‌ళూరు జ‌ట్టుకు కొత్త ఓన‌ర్ ఎవ‌రంటే ?

IND VS SA: ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, షెడ్యూల్‌, బ‌లాబ‌లాలు ఇవే..ఉచితంగా ఎలా చూడాలంటే

Hong Kong Sixes 2025 : హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టిన పాకిస్తాన్..ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా

IPL 2026: SRH జ‌ట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు క‌లిపి ద‌గా, కావ్యపాప స్కెచ్ చూడండి !

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్‌, వేదిక‌లు ఇవే…హైద‌రాబాద్, విశాఖ‌కు అన్యాయం ?

Big Stories

×