IPL 2026 Released Players List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటు మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే ఐపిఎల్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన హడావిడి మొదలైంది. నవంబర్ 15వ తేదీన రిటెన్షన్ లిస్టు, డిసెంబర్ 15వ తేదీన మినీ వేలం నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీంతో తమ జట్టుకు అవసరం లేని ప్లేయర్లను వదిలేసే ప్రక్రియ మొదలుపెట్టాయి 10 ఫ్రాంచైజీల యాజమాన్యాలు. దీంతో చాలామంది కీలక ప్లేయర్లు గతంలో ఆడిన జట్లకు దూరం కాబోతున్నారు. ఈ లిస్టులో మొహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, మ్యాక్సీ మామ, నటరాజన్, పడిక్కల్ లాంటి కీలక ప్లేయర్లు ఉన్నారు. ఇక మొత్తం 10 జట్ల నుంచి రిలీజ్ అయ్యే ప్లేయర్ల లిస్టును ఒకసారి పరిశీలిస్తే,
Also Read: Virat Kohli Restaurant: గోవాపై కన్నేసిన విరాట్ కోహ్లీ..అదిరిపోయే హోటల్ లాంచ్, ధరలు వాచిపోతాయి
సన్రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసే లిస్ట్ విషయానికి వస్తే, పెద్ద ప్లేయర్లనే కావ్య పాప వదిలేస్తున్నారు. మహమ్మద్ షమీ, ఇశాన్ కిషన్, అడం జంపా, అభినవ్, రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ ఉన్నారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి పడిక్కల్, షెఫర్డ్, రసిక్, సుయాస్ , లివింగ్ స్టోన్ దూరం కాబోతున్నారు. విజయ్ శంకర్, కాన్వే, దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్ తో పాటు త్రిపాఠిలను చెన్నై సూపర్ కింగ్స్ వదిలేస్తోంది. ఇప్పటికే అశ్విన్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ విషయానికి వస్తే ముఖేష్ చమీరా, నటరాజన్ , మోహిత్,, డూప్లిసేస్ లాంటి ప్లేయర్లను వదిలేస్తున్నారు. రషీద్ ఖాన్, షారుక్, ఈశాంత్ శర్మను వదిలేస్తోంది గుజరాత్ టైటాన్స్. వెంకటేష్ అయ్యర్, అలీ, డికాక్ అలాగే రమణ్ దీప్ సింగ్ ప్లేయర్లను కేకేఆర్ వదిలేసేందుకు సిద్ధమైందట.
లక్నో విషయానికి వస్తే, సమర్ అలాగే సమద్ లాంటి ప్లేయర్లను వదిలిస్తున్నారు. ముంబై ఇండియన్స్ నుంచి దీపక్ చాహర్, టోప్లే, ముజీబ్ లిస్టులో ఉన్నట్లు సమాచారం. మ్యాక్సీ మామ, స్టోయినిస్, ఫెర్గు సన్, జమీషన్ ఇలాంటి ప్లేయర్లను పంజాబ్ కింగ్స్ వదిలేస్తోంది. మధ్వాల్, షారుఖీ, బర్గర్, తీక్షణ అలాగే హెట్ మేయర్ తో పాటు తుషార్ లను రాజస్థాన్ రాయల్స్ కూడా వదిలేస్తోందట.
Also Read: IPL 2026: SRH నుంచి ట్రావిస్ హెడ్ ఔట్…రంగంలోకి రోహిత్ శర్మ..కావ్య పాప ప్లాన్ అదుర్స్ ?
ఐపీఎల్ 2026 ట్రేడ్ ప్రక్రియ ద్వారా చెన్నై అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక మార్పులు జరిగాయి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా వ్యవహరించిన సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడబోతున్నాడు. ఇక అతన్ని ఇచ్చినందుకుగాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన ఇద్దరు ప్లేయర్లను తీసుకువెళ్తోంది రాజస్థాన్ రాయల్స్. రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరణ్ కూడా ఉంటారు.