Telugu Serials : బుల్లి తెరపై సినిమాలు మాత్రమే కాదు.. సీరియల్స్ కూడా పోటీపడి మరి డిఫరెంట్ స్టోరీ లతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. ఒకప్పుడు సీరియల్స్ చూసేందుకు చాలామంది బోరింగ్ గా ఫీల్ అయ్యేవారు. కానీ ఈ మధ్య మాత్రం సినిమాలను మించిన స్టోరీలతో సీరియల్స్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. ఒక్కో ఛానల్ ఒక్కో రకమైన స్టోరీలతో సీరియల్స్ ను తెరకెక్కిస్తున్నాయి. ప్రస్తుతం స్టార్ మా లో ఎన్ని సీరియల్స్ ప్రసారమవుతున్నాయో అవన్నీ కూడా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. ఇక కార్తీకదీపం తర్వాతే ఏదైనా అని చెప్పాలి.. ఈ సీరియల్ రెండో సీజన్ కూడా జనాలను బాగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు, గుండెనిండా గుడి గంటల మధ్య మంచి పోటీ ఉంది. అయితే ఈ మధ్య పరిస్థితులను బట్టి గుండెనిండా గుడిగంటలు సీరియల్ త్వరలోనే ముగింపు పలుకబోతుందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ సీరియల్ ఎండ్ అవుతుంది అని ఒకసారి తెలుసుకుందాం…
స్టార్ మా లో ప్రజెంట్ ప్రసారం అవుతున్న సీరియల్ కార్తీకదీపం 2 టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. మొదటి పార్ట్ ఏ విధంగా అయితే జనాల అంచనాలకు తగినట్లు ఉందో ఇప్పుడు రెండో పార్ట్ కూడా అంతకుమించి జనాలను ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు.. కుటుంబంలోని మనుషుల మధ్య ప్రేమానురాగాలు, ద్వేషాలు ఎలా ఉంటాయో అనేది ఈ సీరియల్ లో చూపించారు. రీసెంట్ గా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. రేటింగ్ విషయంలో అస్సలు తగ్గట్లేదు.. రెండో స్థానంలో కొనసాగుతుంది.. దీని రేటింగ్ విషయానికొస్తే.. తాజాగా 13.48 రేటింగ్ నమోదైంది.
స్టార్ మాలో ప్రసారం అవుతున్న మరో సీరియల్ గుండెనిండా గుడిగంటలు.. మధ్యతరగతి కుటుంబంలో గొప్పలకు పోయే తిప్పలు తెచ్చుకునే అత్త కోడళ్ల పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో అన్నది సీరియల్ స్టోరీ.. డిఫరెంట్ కథతో వచ్చే ఇది ప్రేక్షకుల గుండెల్లో నిజంగానే చోటు సంపాదించుకుంది. ఈ మధ్య ఈ సీరియల్ మరోసారి ఇంట్రెస్టింగ్గా మారింది. దాంతో రేటింగ్ కూడా బాగానే పెరుగుతూ వస్తుంది. రేటింగ్ విషయానికి వస్తే.. 13.39 ఉందని తెలుస్తుంది. గత వారంతో పోలిస్తే ఈ వారంతో భారీగా పెరిగింది..
Also Read: బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..
ఏంటి..? షాక్ అవుతున్నారా..? గుండెనిండా గుడిగంటలు సీరియల్ ముగింపుకు చేరుకుందని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ వారం ఎపిసోడ్ తో ముగింపు రానుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. బాలు ప్రభావతికి చెప్పాలనుకునే మాటతో సీరియల్ పూర్తి అవుతుందని టాక్.. బంగారం గురించి నిజం చెప్పేస్తే ప్రభావతి తన మనసులోని కుళ్ళను బయట పెడుతుందట. దానివల్ల స్టోరీ రీవిల్ అవుతుందని తెలుస్తుంది. ఆ నిజం ఎప్పుడు బయటపడుతుందో సీరియల్ కు ముగింపు పలకనున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం బాగా వైరల్ అవుతుంది. చూడాలి సీరియల్ నిజంగానే ఎండ్ అవుతుందేమో..