E-Paper
Advertisement

IPL : ఇషాన్ , సూర్య విధ్వంసం.. పంజాబ్ పై ముంబై గెలుపు..

IPL : ఇషాన్ , సూర్య విధ్వంసం.. పంజాబ్ పై ముంబై గెలుపు..
Advertisement

IPL : 215 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు సునాయాసంగా చేధించింది. పంజాబ్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 214 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లివింగ్ స్టోన్ (82 నాటౌట్), జితేష్ శర్మ (49 నాటౌట్) చెలరేగడంతో కింగ్స్ జట్టు స్కోర్ 200 దాటింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (30), మధ్యూ షార్ట్ (27) పర్వాలేదనిపించే స్కోర్ చేశారు. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా 2 వికెట్లు, అర్షద్ ఖాన్ ఒక వికెట్ తీశారు. జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్ల వేసి 56 పరుగులు సమర్పించుకున్నాడు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు రిషి ధావన్ వేసిన తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్ (75), గ్రీన్ (23) స్కోర్ పెంచేందుకు ప్రయత్నించారు. గ్రీన్ అవుటైన తర్వాత ఇషాన్ కు సూర్యకుమార్ యాదవ్ (66) తోడుకావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఫోర్లు, సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మూడో వికెట్ కు 9.1 ఓవర్లలో 116 పరుగులు జోడించారు. దీంతో ముంబై విజయం ఖాయమైపోయింది. కానీ ఒక ఓవర్ వ్యవధిలోనే ఇద్దరూ అవుట్ కావడంతో మ్యాచ్ పై ఉత్కంఠ పెరిగింది. అయితే టిమ్ డేవిడ్ (19 నాటౌట్), తిలక్ వర్మ (26 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ముంబై మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

Advertisement

పంజాబ్ బౌలర్లలో నాథన్ ఇల్లీస్ 2 వికెట్లు, అర్షదీప్ సింగ్, రిషి ధావన్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో అర్ష దీప్ సింగ్ ఘోరంగా విఫలమయ్యాడు. 3.5 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చాడు. అతడి బౌలింగ్ లో ముంబై బ్యాటర్లు 8 ఫోర్లు, నాలుగు సిక్సులు బాదారు. ఇషాన్ కిషన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related News

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Big Stories

Advertisement
×