E-Paper
Advertisement

Delhi : ఢిల్లీలో అర్ధరాత్రి హైడ్రామా.. రెజ్లర్లు, పోలీసులకు మధ్య తోపులాట..

Delhi : ఢిల్లీలో అర్ధరాత్రి హైడ్రామా.. రెజ్లర్లు, పోలీసులకు మధ్య తోపులాట..
Advertisement

Wrestlers Protest News(Breaking News India) : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2వారాలుగా న్యాయ పోరాటం చేస్తున్న రెజ్లర్స్‌కు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెజ్లర్ల దీక్షను భగ్నం చేసేందుకు యత్నించారు పోలీసులు. పోలీసులను రెజ్లర్స్ తీవ్రంగా ప్రతిఘటించడంతో..కాసేపు హైడ్రామా నెలకొంది. పోలీసుల తీరుపై రెజ్లర్స్ మండిపడ్డారు. దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తంచేశారు.

రెజ్లింగ్​ ఫెడరేషన్​ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ ఏప్రిల్ 23 నుంచి జంతర్ మంతర్ వద్ద రెజ్లర్స్ ధర్నా చేస్తున్నారు. రెజ్లింగ్ చీఫ్ పదవీ నుంచి బ్రిజ్ భూషణ్ ను తొలగించి, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా దీక్షా శిబిరం వద్దే ఉంటూ పోరాటం కొనసాగిస్తున్నారు.

Advertisement

వర్షం కారణంగా దీక్షా శిబిరంలోని పరుపులు తడిసిపోవడంతో మడత మంచాలను తీసుకువస్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, రెజ్లర్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాటలో మహిళ రెజ్లర్స్‌కు గాయాలయ్యాయి. దీంతో పోలీసుల తీరుపై రెజ్లర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమీ క్రిమినల్స్ కాదన్నారు. మగ పోలీసులు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మహిళా రెజ్లర్స్ ఆరోపించారు.

రెజ్లింగ్​ ఫెడరేషన్​ చీఫ్ బ్రిజ్ భూషణ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ జనవరిలో తొలుత రెజ్లర్స్ నిరసన చేపట్టారు. దీంతో క్రీడా మంత్రిత్వ శాఖ.. నిజ నిర్థారణ కోసం ఓ కమిటీ వేసింది. కానీ కమిటీ ఇప్పటికీ ఎలాంటి నివేదిక ఇవ్వకపోవడంతో ఏప్రిల్ 23న రెజ్లర్స్ మరోసారి నిరసన బాట పట్టారు. బ్రిజ్ భూషణ్ పై ఫిర్యాదు చేసినా ఢిల్లీ పోలీసులు FIR నమోదు చేయకపోవడంతో ఏడుగురు మహిళా రెజ్లర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. వారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ పై రెండు కేసులు నమోదు చేశారు.

Advertisement

లైంగిక ఆరోపణలతో రెండు కేసులు నమోదు అయినా.. ఇప్పటికే రెజ్లింగ్​ ఫెడరేషన్​ చీఫ్ గా అతనే కొనసాగడంపై రెజ్లర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విచారణ నిష్ఫక్షపాతంగా జరగాలంటే.. బ్రిజ్ భూషణ్ ను పదవి నుంచి తొలగించాలని కోరుతున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×