Jemimah Rodrigues On Ind Vs Pak: మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (Women’s T20 World Cup 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. జూన్ 12వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (India Women vs Pakistan Women) మధ్య ఎడ్జ్ బస్టన్ (Edgbaston, Birmingham) వేదికగా మరో బిగ్ ఫైట్ జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైట్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా డేంజర్ ప్లేయర్ జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ జీసస్ సాక్షిగా చెబుతున్నా.. పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించి తీరుతానని ఆమె శపథం చేశారు. లేకపోతే తన పేరు మార్చుకుంటానని సంచలన ప్రకటన చేశారు. దీంతో జెమిమా రోడ్రిగ్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో రెండు జట్ల ప్లేయర్లు నెట్స్ లో చాలా కష్టపడుతున్నారు. విజయమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అటు అభిమానులు కూడా ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందో అని టెన్షన్ లో ఉన్నారు. గత రికార్డులు పరిశీలిస్తే టీమిండియాకి అడ్వాంటేజ్ ఉంది. కానీ టి20లో ఎవరు గెలుస్తారనేది అంచనా వేయలేం కాబట్టి… టీమిండియా ప్లేయర్లు జాగ్రత్తగా ఆడాల్సిన పరిస్థితి ఉంది.
ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడిస్తానని శపథం చేశారు జెమిమా రోడ్రిగ్స్. తాను ఆరాధించే జీసస్ పైన ఒట్టేసి చెబుతున్నా… పాకిస్తాన్ జట్టుకు ఘోర పరాజయాన్ని చవి చూపిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. తమ వాచ్మెన్ కూడా ఇదే విషయాన్ని తనకు చెప్పాడని గుర్తు చేశారు. ఎవరి చేతిలో ఓడిపోయిన సరే… కానీ పాకిస్తాన్ చేతిలో మాత్రం ఓడిపోవద్దని అతడు తనకు హితోపదేశం చేసినట్లు గుర్తు చేశారు. అతగాడు చెప్పినట్లుగానే… పాకిస్తాన్ జట్టును ఓడిస్తానని ఆమె తాజాగా వెల్లడించారు.
ఆదివారం జరిగే మ్యాచ్ లో తన ప్రతాపం చూపిస్తానని సంచలన ప్రకటన చేశారు జెమిమా రోడ్రిగ్స్. ఆరు నూరైనా పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించడం గ్యారంటీ అన్నారు. తమతో ఆషా మాషీగా ఉండదని వెల్లడించారు. దీంతో జెమిమా రోడ్రిగ్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాలి. ఇది ఇలా ఉండగా, టీమిండియాతో జరగాల్సిన మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ప్రాక్టీస్ సమయంలో గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో ఇండియాతో జరిగే మ్యాచ్ కు ఆమె దూరంగా ఉండే ప్రమాదం పొంచి ఉంది.