E-Paper
Advertisement

Kamran Akmal: పాకిస్తాన్ ను ఓడించేందుకు బీసీసీఐ కుట్ర‌లు… బంగ్లా పిచ్ లు మార్చేసి మ‌రీ !

Kamran Akmal: పాకిస్తాన్ ను ఓడించేందుకు బీసీసీఐ కుట్ర‌లు… బంగ్లా పిచ్ లు మార్చేసి మ‌రీ !
Advertisement

Kamran Akmal:  బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ లోనే పాకిస్తాన్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోవడంపై ఆ జట్టుకు సంబంధించిన మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ( kamran akmal) స్పందించాడు. పాకిస్తాన్ జట్టును ఓడించేందుకు బీసీసీఐ కుట్రలు చేసిందని సీరియస్ అయ్యాడు. బంగ్లాదేశ్ లోని దాకా పిచ్ మొత్తం బీసీసీఐ మార్చేసినట్లు ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో కలిసి ఈ కుట్ర బీసీసీఐ ( BCCI ) చేసిందని మండిపడ్డారు.

Also Read: T20 World Cup 2026: సంజు అదిరిపోయే ఇన్నింగ్స్‌..ఉద్యోగుల‌కు రూ.2.5 లక్షలు బోన‌స్ ఇచ్చిన కేర‌ళ వ్యాపార‌వేత్త‌

8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన పాకిస్తాన్

Advertisement

టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంటులో ( T20 World Cup 2026 tournament ) సూపర్ 8 దాకా వచ్చి, ఇంటి దారి పట్టిన పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ గడ్డపై 3 వన్డేలు ఆడేందుకు వెళ్లిన పాకిస్తాన్ … మొదటి మ్యాచ్ లోనే ఓడిపోయింది. బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan) మధ్య ఢాకా లోని షేర్ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం ( Shere Bangla National Stadium, Dhaka ) వేదికగా అంతర్జాతీయ వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇందులో పాకిస్తాన్ మొదటి బ్యాటింగ్ చేసి 30.4 ఓవర్లు ఆడింది. ఈ సందర్భంగా 114 పరుగులు సాధించింది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. అయితే ఈ 115 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15 ఓవర్లలో ఊది పారేసింది బంగ్లాదేశ్. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించడం జరిగింది. 3 వన్డేల సిరీస్ లో 1-0 తేడాతో బంగ్లాదేశ్ ముందంజలోకి వచ్చింది.

పాకిస్తాన్ ఓటమిపై కెమెరా నగ్మాల్ ఆరోపణలు

బంగ్లాదేశ్ చేతిలో 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓడిపోయిన సందర్భంగా ఆ జట్టుకు సంబంధించిన మాజీ వికెట్ కీపర్ క‌మ్రాన్ అక్మ‌ల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢాకా స్టేడియంలో పిచ్ మొత్తం మార్చేసింది బీసీసీఐ అంటూ ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో చేతులు కలిపి బీసీసీఐ ఈ పని చేసిందని మండిపడ్డారు. అలాగే బంగ్లాదేశ్ బౌలర్లు వేసే బంతుల్లో చిప్ లు కూడా పెట్టారని షాకింగ్ ఆరోపణలు చేశారు క‌మ్రాన్ అక్మ‌ల్. మొత్తం బంగ్లాదేశ్ మ్యాచ్ గెలిచేలా భారత్ క్రికెట్ నియంత్రణ మండలి కుట్రలకు తెరలేపిందని బాంబు పేల్చారు క‌మ్రాన్ అక్మ‌ల్. దీనిపై ఐసీసీ విచార‌ణ చేయాల‌ని డిమాండ్ చేశారు. లేక‌పోతే పాకిస్తాన్ మొత్తం వ‌న్డే సిరీస్ ను కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని వెల్ల‌డించారు.

Advertisement

Also Read: T20 World Cup 2026: కొంప‌ముంచిన‌ గిల్ సెల‌క్ష‌న్…గంభీర్, అగార్క‌ర్ మ‌ధ్య గొడ‌వ‌లు, టీమిండియాలో ప్ర‌కంప‌న‌లు !

 

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×