Pakisthan – Kohli: విరాట్ కోహ్లీకి ( Virat Kohli ) పాకిస్తాన్ లో (Pakisthan ) మంచి క్రేజీ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం చాలా సార్లు రుజువు అయింది. అయితే తాజాగా మరోసారి విరాట్ కోహ్లీ అంటే ఎంత ప్రేమ ఉందో పాకిస్తాన్ అభిమానులు తెలియజేశారు. కోహ్లీ కోహ్లీ… RCB, RCB అంటూ పాకిస్తాన్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్ చట్ల మధ్య వన్డేస్ ట్రై సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే.
Also Read: Telugu Warriors – CCL 2025: ఉప్పలో తమన్ మాస్ డ్యాన్స్..తెలుగు వారియర్స్ విక్టరీ !
అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన ఫైనల్ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో ( Karachi National stadium ) జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా… పాకిస్తాన్ అభిమానులు ( Pakisthan Fans )… కరాచీ స్టేడియం ( Karachi stadium ) దగ్గర సందడి చేశారు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత.. బయటకు వచ్చి విరాట్ కోహ్లీ ( Virat Kohli ) అంటూ అరిచారు. అదే సమయంలో ఆర్సిబి నామస్మరణం చేస్తూ మరచిపోయారు. మరి కొంతమంది అయితే… పాకిస్తాన్ బాబర్ అజాం.. డౌన్ డౌన్… విరాట్ కోహ్లీ జిందాబాద్ ( Virat Kohli Zindabad) అంటూ స్లొగన్స్ కూడా ఇచ్చారు.
Also Read: Nz vs Pak Final: చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. సొంత గడ్డపై చిత్తు?
ఇది ఇలా ఉండగా కరాచీ లోని నేషనల్ స్టేడియంలో నిన్న జరిగిన వన్డే ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో మరోసారి బాబర్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు పైన న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి… వన్డే ట్రై సిరీస్ సొంతం చేసుకుంది. చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంటు కంటే ముందు… సన్నాహక సిరీస్ లో భాగంగా ఈ వన్డే సిరీస్ నిర్వహించారు. అయితే ఈ టోర్నమెంటులో సొంత గడ్డపై పాకిస్తాన్ మట్టి కరిచింది. ఇది ఇలా ఉండగా… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ).. మరో నాలుగు రోజుల్లోనే ప్రారంభం కానుంది.
ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. హైబ్రిడ్ మోడల్ లో జరుగుతున్న ఈ టోర్నమెంట్ నేపథ్యంలో… టీమిండియా మ్యాచ్ లన్ని దుబాయిలో జరుగుతాయి. ఇక ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్ టీంతో టీమిండియా తలపడనుంది. ఆ తర్వాత.. ఆదివారం రోజున అంటే.. ఫిబ్రవరి 23వ తేదీన ఆతిధ్య పాకిస్థాన్ జట్టుతో తలపడుతుంది టీమిండియా. కాగా ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కోసం ఇవాళ సాయంత్రం.. దుబాయ్ కు టీమిండియా వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Fans chant 'Kohli, Kohli' and 'RCB, RCB' outside Karachi Stadium in Pakistan. pic.twitter.com/nTQ7r8bK4A
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 14, 2025