E-Paper
Advertisement

Manu Bhaker| లక్షల నుంచి కోట్లలోకి మను భాకెర్ ఫీజు.. క్యూ కడుతున్న కంపెనీలు!

Manu Bhaker| లక్షల నుంచి కోట్లలోకి మను భాకెర్ ఫీజు.. క్యూ కడుతున్న కంపెనీలు!
Advertisement

Manu Bhaker| పారిస్ ఒలింపిక్స్ లో భారత్ చాటుతున్న మనూ భాకెర్ పాపులారిటీ పీక్స్ లో ఉంది. ఇండియా షూటింగ్ చాంపియన్ గా పేరొందిన మనూ ఇప్పటికే రెండు కాంస్య పతకాలు సాధించగా మరో పతకం వేటలో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె పేరు ఇండియన్ మీడియాలో మార్మోగిపోతోంది. ఫలితంగా ఆమెను తమ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్, తమ ప్రాడక్ట్స్ కోసం యాడ్స్ చేయమని చాలా కంపెనీ ప్రతినిధులు క్యూ కడుతున్నారు. దీంతో మనూ భాకెర్ తన రెమ్యూనరేషన్ ఫీజు ఒక్కసారిగా ఆరింతలు, ఏడింతలు పెంచేసింది.

ఒలింపిక్స్ ముందువరకు ఆమె ఒక కంపెనీ యాడ్ చేయాలంటే.. 20 నుంచి 25 లక్షలు అడిగేది. అయితే ప్రస్తుతం ఆమె కోటి 20 లక్షల నుంచి 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం.. ఇటీవల ఆమె ఒక యాడ్ కోసం కోటిన్నర డిమాండ్ చేసింది. కేవలం గత రెండు మూడు రోజుల్లోనే దాదాపు 40 కంపెనీలు ఆమె కోసం ప్రయత్నిస్తున్నట్లు మనూ భాకెర్ కోసం పనిచేస్తున్న యాడ్ ఏజెన్సీ ఐఓఎస్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్ టైన్మెంట్ సిఈఓ నీరవ్ తోమర్ తెలిపారు.

Advertisement

మనూ భాకెర్ ప్రస్తుతం ఒక సంవత్సరం కోసం మాత్రమే యాడ్ కాంట్రాక్స్ ఒప్పుకుంటున్నారని.. రెండు లేదా జీవిత కాలం బ్రాండ్స్ ప్రమోషన్ కోసం ఫీజు తక్కువగా ఉంటుందని తోమర్ వెల్లడించారు. ఇప్పటివరకు వచ్చిన కంపెనీలన్నీ రెండు లేదా మూడు నెలల వ్యవధి కోసమే యాడ్ చేయాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

Also Read: బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్ రికార్డ్.. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లోకి లక్ష్య సేన్

”ఏషియన్ గేమ్స్, కామన్ వెల్త్ గేమ్స్ లో మన భారతీయులు షూటర్లు గెలుచుకున్న మెడల్స్ అంత ప్రాముఖ్యం లభించదు.. అదే ఒలింపిక్స్ విషయం వేరు. ఒలింపిక్స్ లో ఒకటి లేదా రెండు మెడల్స్ సాధిస్తే.. విపరీతమైన పాపులారిటీ వస్తుంది,” అని తోమర్ అభిప్రాయపడ్డారు.

టోక్యో ఒలింపిక్స్ నిరాశ చెందిన మనూ భాకెర్ ఒలింపిక్స్ తో భారత్ కోసం పతకాలు సాధించిన తరువాత ఆమె గతంలో ఒలింపిక్స్ బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా లాగా నేషనల్ స్పోర్ట్స్ ఐకాన్ గా మారింది. ప్రస్తుతం మనూ భాకెర్ ఒలింపిక్స్ పోటీల్లో మూడో పతకం సాధన పై మాత్రమే దృష్టి పెట్టింది. శనివారం జరగబోయే చాటియోరాక్స్ షూటింగ్ రేంజ్ ఫైనల్ కు మనూ భాకెర్ అర్హత సాధించింది. ఫైనల్లో మొత్తం 8 మంది షూటర్స్ పాల్గొంటారు. ఫైనల్లో మనూ భాకెర్ బంగారు పతకం సాధిస్తే.. ఆమె అభినవ్ బింద్రా, నీరజ్ చోప్రా తరువాత ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించిన మూడో క్రీడాకారిణి చరిత్ర సృష్టిస్తుంది.

Also Read: మను భాకర్ కోచ్‌కు షాక్.. ఇంటిని కూల్చేస్తామని నోటీసు

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×