E-Paper
Advertisement

Inzamam-ul-Haq: క్రికెట్ చ‌రిత్ర‌లో ఇది చీక‌టి రోజు..జింబాబ్వే వెధ‌వ‌లు బీసీసీఐకి అమ్ముడుపోయారు

Inzamam-ul-Haq: క్రికెట్ చ‌రిత్ర‌లో ఇది చీక‌టి రోజు..జింబాబ్వే వెధ‌వ‌లు బీసీసీఐకి అమ్ముడుపోయారు

Inzamam-ul-Haq: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా గురువారం జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా ( Team India vs Zimbabwe) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా, 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియా సెమీ ఫైనల్ ఛాన్సులు మరింత పెరిగాయి. ఒక్క అడుగు దూరంలోనే టీమ్ ఇండియా ఉంది. వెస్టిండీస్ పైన విజయం సాధిస్తే నేరుగా సెమీ ఫైనల్ ఛాన్స్ కొట్టేస్తుంది టీం ఇండియా. అయితే చెన్నై వేదికగా జరిగిన జింబాబ్వే-టీమిండియా మ్యాచ్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( INZAMAM-UL-HAQ). ఇండియా వర్సెస్ జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్ లో ఫిక్సింగ్ ( match fixing) జరిగిందని ఆరోపణలు చేశారు. గల్లీ పోరగాళ్లకు వేసినట్లుగా టీమిండియా బ్యాటర్లకు బంతులు వేశారని జింబాబ్వే బౌలర్ల పై ఫైర్ అయ్యారు. అందుకే టీమిండియా అవలీలగా 250కి పైగా స్కోర్ సాధించగలిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంజమామ్ వుల్ హక్. జింబాబ్వేపై టీమిండియా కుట్ర‌లు చేసి గెల‌వడం క్రికెట్ చ‌రిత్ర‌లో చీక‌టి రోజు అంటూ వ్యాఖ్యానించారు.

Also Read: India Semifinal Qualification Scenario: వెస్టిండీస్ తో జ‌రిగే మ్యాచ్ కు వ‌ర్షం గండం ? టీమిండియా సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతేనా !

బీసీసీఐ డబ్బులకు అమ్ముడుపోయిన జింబాబ్వే బౌలర్లు ?

జింబాబ్వేపై టీమిండియా విజయం సాధించడం పైన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందని.. జింబాబ్వే బౌలర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి డబ్బులు ఇచ్చిందని ఆరోపణలు చేశారు. ఆ డబ్బులు తీసుకొని గల్లీ పోరగాళ్లకు వేసినట్లుగా బంతులు వేశారని జింబాంబే బౌలర్ల పై నిప్పులు చెరిగారు. అందుకే టీమిండియా 256 పరుగులు అవలీలగా సాధించగలిగిందని పేర్కొన్నారు ఇంజమామ్ వుల్ హక్. మొదటి బంతి నుంచి చివరి బంతి వరకు చూస్తే మనకు ఫిక్సింగ్ జరిగినట్లే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. అసలు ఫామ్ లో లేని అభిషేక్ శర్మ అర్థ సెంచరీ చేయడం వెనుక కుట్ర కోణం ఉందని మండిపడ్డారు. ఇక టెస్ట్ ప్లేయర్ గా రూపాంతరం చెందిన తిలక్ వర్మ కూడా 300ల‌ స్ట్రైక్ రేట్ సాధించడం వెనుక బీసీసీఐ కుట్రలు ఉన్నాయని బాంబు పేల్చారు. అందుకే 72 పరుగుల తేడాతో జింబాబ్వేపై టీమిండియా విజయం సాధించిందని ఆరోపణలు చేశారు. రేపు వెస్టిండీస్ పైన కూడా ఇదే జరుగుతుందని కూడా వ్యాఖ్యానించారు ఇంజమామ్ వుల్ హక్.

ఎన్ని కుట్రలు చేసినా టీమిండియా సెమీఫైనల్ వెళ్లదు

టీమిండియా సెమీ ఫైనల్ వెళ్లడం పైన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ వింతగా స్పందించారు. ఎన్ని కుట్రలు చేసినా.. మీ దేవుడు దిగివచ్చిన టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్లబోదని.. ఇంటి దారి పట్టడం గ్యారెంటీ అంటూ మహమ్మద్ అమీర్ హాట్ కామెంట్స్ చేశారు. గ్రూప్ 1 నుంచి దక్షిణాఫ్రికా అలాగే వెస్టిండీస్ మాత్రమే సెమీ ఫైనల్ కు చేరుతాయని తెలిపారు.

Also Read: Daisy Shah On Palash: పలాష్ ముచ్చల్ చాలా మంచోడు..స్మృతినే కిలాడీ లేడీ ?..బాలీవుడ్ నటి సంచ‌ల‌నం !

 

 

 

 

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×