E-Paper
Advertisement

అయోధ్య హుండీ లెక్కింపు సిబ్బంది రాజీనామా.. వెలుగులోకి సంచలన విషయాలు!

అయోధ్య హుండీ లెక్కింపు సిబ్బంది రాజీనామా.. వెలుగులోకి సంచలన విషయాలు!
Advertisement

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. మొక్కులు తీర్చుకుని హుండీలో భారీగా విరాళాలు సమర్పిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ విరాళాల లెక్కింపే వివాదంగా మారింది. విరాళాల దుర్వినియోగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

వరుసగా ఉద్యోగాలకు రాజీనామా..

Advertisement

దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే.. హుండీ లెక్కించే సిబ్బంది వరుసగా ఉద్యోగాలకు రాజీనామా చేయడంతో మరిన్ని అనుమానాలు వస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు ఉద్యోగాలు వదిలేయడంతో అసలు అక్కడ ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. ఒకప్పుడు హుండీ లెక్కింపులో దాదాపు 40 మంది ఉద్యోగులు పనిచేసేవారు. కానీ ఇప్పుడు కేవలం 12 మంది మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. 20 మందికిపైగా సిబ్బంది రాజీనామా చేయడంతో లెక్కింపు ప్రక్రియ కూడా నెమ్మదించింది.

Also Read: వియత్నాం బోటు ప్రమాదంలో ఏపీ పర్యాటకులు.. రంగంలోకి దిగిన నారా లోకేష్!

Advertisement

ఉద్యోగాలు వదిలారా..? దర్యాప్తుకు భయపడ్డారా..?

విరాళాల స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హుండీ లెక్కింపు కేంద్రంలోకి వెళ్లే ప్రతి ఉద్యోగిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. భద్రతా నిబంధనలు కఠినతరం అయిన తర్వాతే ఇంతమంది ఉద్యోగులు రాజీనామా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీళ్లు ఎందుకు ఉద్యోగాలు వదిలారు..? దర్యాప్తుకు భయపడ్డారా..? లేక మరో కారణం ఉందా..? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఈ నెల 13న సమగ్ర విచారణ

మరోవైపు ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లింది. విరాళాల వ్యవహారంపై స్వతంత్రంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 13న విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది..? విరాళాల వ్యవహారంపై ఉన్న అనుమానాలకు తెరపడుతుందా..? లేక మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయా..? అన్నది ఆసక్తిగా మారింది.

Also Read: స్కూల్ బస్సులకు పసుపు రంగే ఎందుకు? దీని వెనుక ఏవైనా కారణాలు ఉన్నాయా?

Related News

కొండా ఫ్యామిలీ దారెటు? తీన్మార్ మ‌ల్ల‌న్న పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ ఏమిటీ? బీసీల కార్డులు ప‌నిచేయ‌డం లేదా? 

అప్పుడు వాళ్లు సుప్రీంలు… ఇప్పుడు ప‌ట్టింపేలేదా? ఇద్ద‌రి పాల‌న‌లో ఎమ్మెల్యేలెలా ఉన్నారు?

సీఎం బాగు కోసం ఆర్కే ప‌లుకులు.. స‌ర్కార్ వాస్త‌వ పరిస్థితి క‌ళ్ల‌ముందు పెట్టే ప్ర‌య‌త్నం.. అది సూచ‌నా? బెదిరింపా? ద‌బాయింపా?

సరిహద్దుల్లో డేంజర్ బెల్స్.. చైనా హెచ్చరికలతో జంకుతున్న నేపాల్!

నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ!

బాల్కొండ బ‌రి నుంచి మ‌హేశ్‌? మ‌రి ఆ న‌లుగురి ప‌రిస్థితి? ఇందూరు కాంగ్రెస్‌లో ర‌చ్చ రాజ‌కీయం!

జ‌నసేన ఎంట్రీకి క‌లిసివ‌స్తోన్న జెన్‌జీ.. యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ప‌నికివ‌స్తుందా?

రాజ‌కీయాల్లో ర‌ఘువీరా మ‌ళ్లీ యాక్టివ్.. పార్టీకి పూర్వవైభవం తెస్తారా?

Big Stories

Advertisement
×