E-Paper
Advertisement

MI Vs RCB : విరాట్ , డుప్లెసిస్ విధ్వంసం.. ముంబై చిత్తు..

MI Vs RCB : విరాట్ , డుప్లెసిస్ విధ్వంసం.. ముంబై చిత్తు..
Advertisement

MI Vs RCB : ఐపీఎల్ తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చెలరేగిపోయింది. ముంబై జట్టును చిత్తు చేసింది. విరాట్ కోహ్లి, డుప్లెసిస్ విధ్వంసం సృష్టించారు. దీంతో 172 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 16.2 ఓవర్లలోనే చేధించింది. కోహ్లి (82 నాటౌట్, 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులు), డుప్లెసిస్ (73, 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులు) తొలి వికెట్ కు 148 పరుగులు జోడించారు.వీరిద్దరు ముంబై బౌలర్లను ఆటాడుకున్నారు. ఎడపెడా సిక్సులు , ఫోర్లతో విరుచుకుపడ్డారు. దీంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. డుప్లెసిస్ , దినేష్ కార్తీక్ (0) వెంటవెంటనే అవుట్ అయినా.. ఆ తర్వాత దిగిన మ్యాక్స్ వెల్ 3 బంతుల్లో 2 సిక్సులతో 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో బెంగళూరు జట్టు 22 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబై బౌలర్లలో అరంగ్రేటం బౌలర్ అర్షద్ ఖాన్ , కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ గెలిచి బెంగళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై జట్టు పవర్ ప్లే ముగియముందే 20 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఇషాన్ కిషన్ (10), కామోరూన్ గ్రీన్ (5), రోహిత్ శర్మ (1) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. ముఖ్యంగా హిట్ మ్యాన్ 10 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి తీవ్రంగా నిరాసపర్చాడు. సూర్యకుమార్ యాదవ్ (15) కాసేపు క్రీజులో నిలబడినా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. దీంతో 48 పరుగులకే ముంబై 4 వికెట్లు కోల్పోయింది.

Advertisement

గత సీజన్ లో అదరగొట్టిన తెలుగు కుర్రోడు తిలక్ వర్మ అద్బుత పోరాటం చేశాడు. అరంగ్రేటం ఆటగాడు నిహల్ వదెరా ( 21, 13 బంతుల్లో 1 ఫోర్ , 2 సిక్సులు) తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. నిహల్, టిమ్ డేవిడ్ (4) , హృతిక్ సోకెన్ (5) వికెట్లు వెంటవెంటనే పడటంతో ముంబై 17.1 ఓవర్లలో 123 పరుగులు ఏడు వికెట్లు కోల్పోయింది. స్కోర్ 150 దాటడం కూడా కష్టమే అనిపించింది. కానీ చివరి 3 ఓవర్లలో తిలక్ వర్మ ఫోర్లు, సిక్సులతో చెలరేగిపోయాడు. దీంతో చివరి 17 బంతుల్లో ముంబై 48 పరుగులు చేసింది. తిలక్ వర్మ ( 84 నాటౌట్, 46 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులు ) అజేయంగా నిలిచాడు. అర్షద్ ఖాన్ ( 15 నాటౌట్, 9 బంతుల్లో 1 సిక్సు) చక్కటి సహకారం అందించాడు. దీంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

ప్రత్యర్థి ముందు మంచి టార్గెట్ నే ఉంచినా బౌలర్లు పూర్తిగా విఫలంకావడంతో ముంబై చిత్తుగా ఓడింది. బ్యాట్ తో విధ్వంసం సృష్టించి మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చేసిన కెప్టెన్ డుప్లెసిస్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Advertisement

ఇప్పటి వరకు ఐపీఎల్ 2023 సీజన్ లో అన్ని జట్లు ఒక మ్యాచ్ ఆడేశాయి. గుజరాత్, పంజాబ్, లక్నో, రాజస్థాన్ , బెంగళూరు జట్లు శుభారంభం చేశాయి. చెన్నై, కోల్ కతా, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై జట్లు ఓటమిని చవిచూశాయి.

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×