Nita Ambani crying: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ( Mumbai Indians vs Sunrisers Hyderabad, 41st Match) మధ్య మ్యాచ్ జరిగింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ 243 పరుగులు చేసినప్పటికీ హైదరాబాద్ అవలీలగా చేదించింది. అయితే ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన నేపథ్యంలో ఓనర్ నీతా అంబానీ ( Nita Ambani crying) కన్నీళ్లు పెట్టుకున్నారు. భారీ స్కోరు సాధించినప్పటికీ హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన బాధను తట్టుకోలేక ఏడ్చేశారు. దీంతో నీతా అంబానీ కన్నీళ్లు పెట్టుకున్న ఫోటో వైరల్ గా మారింది.
దీంతో అంబానీ భార్య నీతా (Nita Ambani) కన్నీళ్లు పెట్టుకోవడంపై రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. కోటీశ్వరుడైన అంబానీ… ఇప్పటికే ఐదు ట్రోఫీలు గెలుచుకున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ఉన్న ముంబై ఇండియన్స్ గతంలో ఐదు ట్రోఫీలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. దానికి తోడు ప్రపంచంలోనే అపర కుబేరుడుగా అంబానీ ఫ్యామిలీ ఉంది. అయినప్పటికీ ఒక్క మ్యాచ్ ఓటమి.. కోటీశ్వరుడైన అంబానీ భార్య నీతాను బాధ పెట్టింది. దీంతో ఎన్ని కోట్లు ఉన్నా సరే… కొన్నిసార్లు కష్టాలు తప్పవని సోషల్ మీడియాలో రకరకాల మెసేజ్ లు వైరల్ చేస్తున్నారు. డబ్బుంటే దీన్ని కూడా కొనలేము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మాదిగ మ్యాచ్ జరిగింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో SRH బంపర్ విజయం అందుకుంది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్ణీత 20 ఓవర్లు ఆడింది ముంబై ఇండియన్స్. ఈ క్రమంలో ఐదు వికెట్లు నష్టపోయిన ముంబై ఇండియన్స్ 243 పరుగులు సాధించింది. ఇందులో ఓపెనర్ విల్ జాక్స్ 46 పరుగులు చేయగా…ర్యాన్ రికెల్టన్ 123 పరుగులతో రెచ్చిపోయాడు. 55 బంతులోనే ఈ పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది సిక్సర్లు కొట్టిన రికార్డు 10 బౌండరీలు బాదాడు. 223 స్ట్రైక్ రేట్ సాధించిన రికెల్టన్ చివరి వరకు ఆడాడు. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఉచ్చ ఆగినట్టు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్.. తొందరగా మ్యాచ్ ఫినిష్ చేసింది. కేవలం 18.4 ఓవర్లలో ముంబై ఇండియన్స్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ విక్టరీ అందుకుంది. హైదరాబాద్ ఓపెనర్ హెడ్ 76 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 45 పరుగులతో అదరగొట్టాడు. అటు కాటేరమ్మ కొడుకు క్లాసెన్ 65 పరుగులు చేయగా సలీం అరోరా 30 పరుగులతో రెచ్చిపోయాడు.
Mumbai Indians owner Nita Ambani started crying after seeing her billion dollars team's downfall under Captain Hardik Pandya 🥹💔#MIvsSRH pic.twitter.com/9KOiHnMJqD
— DemonX (@OurLifeWithX) April 29, 2026