E-Paper
Advertisement

Srilanka vs India 3rd ODI: పడుకున్న వాళ్లని లేపి రమ్మన్న ఫలితం: శ్రీలంక వన్డే సిరీస్ ఓటమి..

Srilanka vs India 3rd ODI: పడుకున్న వాళ్లని లేపి రమ్మన్న ఫలితం: శ్రీలంక వన్డే సిరీస్ ఓటమి..
Advertisement

Netizence Comments on Team India after loss SL vs IND 3rd ODI Match: శ్రీలంక వన్డే జట్టులో ఆడిన టీమ్ ఇండియా ఆటగాళ్లందరికి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. అయితే ఇందులో సీనియర్లయిన రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఇద్దరూ కూడా ఈ సిరీస్ కి రెస్ట్ అడిగారు. కానీ గౌతం గంభీర్ పట్టుపట్టి మరీ పిలిచి ఆడించాడు. ఫలితంగా రోహిత్ శర్మ బ్యాటర్ గా సఫలమయ్యాడు. కానీ జట్టుని గెలిపించలేకపోయాడు. సిరీస్ ఓటమి పాలైంది.

ఇక విరాట్ కొహ్లీకి శ్రీలంకపై అద్భుతమైన రికార్డ్ ఉంది. ఏకంగా 10 సెంచరీలు చేశాడు. మరి అలాంటి ఆటగాడు, అసలు ఆడటమే రాదన్నట్టు ఆడాడు. మూడు వన్డేల్లో 14, 24, 20 ఇలాగే చేశాడు. జట్టుని కాపాడి, ఒంటిచేత్తో గెలిపించే విరాట్ కొహ్లీ ఇలా అయిపోవడంపై తనని ఏమీ అనలేక, నెట్టింట సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చివరికి గౌతం గంభీర్ పై పడుతున్నారు.

Advertisement

ఇంట్లో పడుకున్నోళ్లని లేపి, ఆడటానికి రమ్మంటే ఇలాగే ఉంటుందని సెటైర్లు వేస్తున్నారు. అసలు కొహ్లీకి ప్రాక్టీస్ ఎక్కడుందని అంటున్నారు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ను చూస్తుంటే సీనియర్లందరూ ఇంతవరకు దొరికిన ఖాళీ సమయంలో ఫుల్ రిలాక్స్ అయిపోయారని అర్థమవుతోందని అంటున్నారు. మొత్తం ప్రాక్టీస్ ని అటకెక్కించేశారని చెబుతున్నారు.

Also Read: సిరాజ్ తో అన్ని ఓవర్లు అవసరమా?: రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు

Advertisement

ఇవన్నీ చూసిన తర్వాత రాబోవు సిరీస్ లకి సీనియర్ల వళ్లు వంగాలంటే, కనీసం నెలరోజుల ముందు నుంచే కండీషనింగ్ క్యాంపులు నిర్వహించాలని అంటున్నారు. లేదంటే టీమ్ ఇండియా బ్రాండ్ వాల్యూ పడిపోతుందని అంటున్నారు. అలాగే బ్యాటింగ్, బౌలింగు కోచ్ లు ప్రాక్టీస్ పెంచాలి.

శ్రీలంక జూనియర్ స్పిన్నర్లు.. టీమ్ ఇండియాలోని వరల్డ్ క్లాస్ నెంబర్ వన్ బ్యాటర్లను వణికిస్తుంటే, మన సీనియర్ బౌలర్లు శ్రీలంక బ్యాటర్లపై వీసమెత్తయినా ప్రభావం చూపలేకపోయారు. ఇటు బౌలింగు, అటు బ్యాటింగ్ అన్నింటా టీమ్ ఇండియా వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి.

కొత్తగా జట్టులోకి వచ్చిన శివమ్ దూబెకి మరెన్ని అవకాశాలు ఇవ్వాలనేది ఆలోచించాలి. అలాగే రియాన్ పరాగ్ రూపంలో ఒక ఆశాకిరణం కనిపిస్తోంది. వన్డే జట్టుకి పనికి రారని తీసేసిన సూర్యకుమార్, యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ వీరందరినీ జట్టులోకి తీసుకోవాలి. రాబోవు వన్డే సిరీస్ లకు.. వన్డే జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×