Rohit – Travis head : ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో రోహిత్ అలాగే హెడ్ ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా కనిపించేవారు. అయితే రోహిత్ ఎక్కడ కనిపించినా అతని వైపు రొమాంటిక్ గా చూసేవాడు. ఇక ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని కొందరు ఫేక్ వార్తలు సృష్టించారు. అయితే నిన్న జానీ బెయిర్ స్టో ను రోహిత్ హగ్ చేసుకోవడంతో హెడ్ హర్ట్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. ట్రావిస్ హెడ్ తో బ్రేకప్ పెట్టుకొని.. బెయిర్ స్టో తో లైన్ క్లియర్ చేసుకున్నాడని వార్తలు వినిపించడం విశేషం. గుజరాత్ టైటాన్స్ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడి ఇంటి ముఖం పట్టింది. ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచి క్వాలిఫయర్ 2 కి దూసుకెల్లింది. గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ 80 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఆ జట్టును మాత్రం గెలిపించుకోలేకపోయాడు. అతను ఆరెంజ్ క్యాప్ రేసులో మాత్రం దూసుకుపోయాడు.
Also Read : LSG Fan : రిషబ్ పంత్ పరువు తీస్తున్నారుగా… ఆ జంపింగ్ లు అంటూ!
ప్రస్తుతం 759 పరుగులు చేశాడు సాయి సుదర్శన్. ఇప్పటివరకు టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. పర్పుల్ క్యాప్ ను దక్కించుకునేందుకు గుజరాత్ టైటాన్స్ బౌలర్ రేసులో ఉండటం విశేషం. ప్రసిద్ధ్ కృష్ణ 25 వికెట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. సాయి సుదర్శన్ టాప్ లో కొనసాగుతుండగా.. సూర్య కుమార్ యాదవ్ 673, శుబ్ మన్ గిల్ 650, మిచెల్ మార్ష్ 627, విరాట్ కోహ్లీ 614 టాప్ 5లో కొనసాగుతున్నారు. ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ 81 పరుగులు, బెయిల్ స్టో 47 పరుగులు చేశారు. 20 ఓవర్లలో 228 పరుగులు చేసింది ముంబై జట్టు. కానీ గుజరాత్ కేవలం 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గుజరాత్ బ్యాటర్లు సాయి సుదర్శన్ 80, వాషింగ్టన్ సుందర్ 48, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అశ్వని కుమార్, బౌల్ట్ కూడా బౌలింగ్ లో రాణించారు. ముంబై ఫైనల్ లో స్థానం కోసం క్వాలిఫ్లయర్ లో పంజాబ్ తో తలపడుతుంది.
అసలే కొండంత లక్ష్యం. ఆపై ఫామ్ లో ఉన్న బ్యాటర్ గిల్ తొలి ఓవర్ లోనే వెనుదిరగడం పెద్ద షాక్.. అయినా ఛేదనలో గుజరాత్ పోటీలోనే నిలిచింది. కారణం ఓపెనర్ సాయి సుదర్శన్ అనే చెప్పాలి. టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడుతున్న సుదర్శన్.. మరోసారి తన విలువను చాటుకున్నాడు. ఒత్తిడిలో గొప్పగా బ్యాటింగ్ చేశాడు. సాధికారిక షాట్లతో అలరించాడు. మరోవైపు కుశాల్ మెండిస్ 10 బంతుల్లో 20 పరుగులు చేశాడు. సుదర్శన్ సిక్స్.. మెండిస్ 2 సిక్స్ లు బాదడంతో ఇన్నింగ్స్ మూడు ఓవర్లలో బౌల్ట్ 21 పరుగులు ఇచ్చాడు. ఆ తరువాత కూడా సుదర్శన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మెండిస్ అనూహ్యంగా హిట్ వికెట్ గా వెనుదిరిగినా.. వాష్టింగ్టన్ సుందర్ రూపంలో సుదర్శన్ కి మరో చక్కని జోడీ లభించింది. శాంట్నర్ బౌలింగ్ వరుస ఫోర్లతో సెంచరీ సాధించాడు. 11 ఓవర్లలోనే 119 పరుగులు చేయడంతో సులభంగా గెలుస్తుంది గుజరాత్ అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ముంబై బౌలర్లు కట్టడి చేయడంతో గుజరాత్ ఓడిపోయారు.
— Out Of Context Cricket (@GemsOfCricket) May 31, 2025