E-Paper
Advertisement

Virat Kohli: వద్దురా సోదరా… పెళ్లంటే నూరేళ్ల మంటరా… డోంట్ మ్యారీ అంటున్న కోహ్లీ.. అనుష్క టార్చర్ భరించలేక!

Virat Kohli: వద్దురా సోదరా… పెళ్లంటే నూరేళ్ల మంటరా… డోంట్ మ్యారీ అంటున్న కోహ్లీ.. అనుష్క టార్చర్ భరించలేక!

Virat Kohli: వింబుల్డన్ 2025 ఇంగ్లాండ్ వేదికగా హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. వింబుల్డన్ టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన జకోవిచ్.. క్వార్టర్ ఫైనల్స్ కి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో జొకోవిచ్ మ్యాచ్ ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద ఎత్తున అథ్లెట్లు హాజరయ్యారు.

Also Read: Viral Video: కుక్కతో క్రికెట్ మ్యాచ్… సామాన్లు మొత్తం జారిపోయాయి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

అలాగే నోవాక్ మ్యాచ్ ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారత స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఐపీఎల్ తర్వాత తొలిసారి ఈ స్టేడియంలో తన భార్యతో అనుష్క శర్మతో కలిసి తలుక్కుమన్నాడు. సోమవారం రోజు జరిగిన నోవాక్ జొకోవిచ్ నాల్గవ రౌండ్ మ్యాచ్ ను వారు ముందు వరుసలో కూర్చొని వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. కొంతమంది అభిమానులు ఈ ఫోటో పై విమర్శలు చేస్తున్నారు.

2015 వింబుల్డన్:

2015లో కూడా విరాట్ కోహ్లీ ఈ వింబుల్డన్ కి హాజరయ్యాడు. అప్పటికి విరాట్ కోహ్లీకి వివాహం జరగలేదు. కానీ అనుష్క శర్మతో ప్రేమలో ఉన్నాడు. అప్పుడు సచిన్ టెండూల్కర్ – అంజలి కూడా ఈ వింబుల్డన్ కి హాజరయ్యారు. ఆ సమయంలో ప్రముఖుల కోసం రిజర్వ్ చేయబడిన రాయల్ బాక్స్ లో కూర్చుని.. రోజర్ ఫెదరర్ – అండి ముర్రే మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ని సచిన్, విరాట్ కోహ్లీ జంటలు వీక్షించారు.

అయితే ఆ సమయంలో విరాట్ కోహ్లీ ఎంతో గ్లామర్ గా ఉన్నాడని, 2025 వింబుల్డన్ కి వచ్చేసరికి మాత్రం.. అనుష్క శర్మ టార్చర్ భరించలేక ఇలా తయారయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు. 2025 వింబుల్డన్ కి హాజరైన విరాట్ – అనుష్క జంటకు సంబంధించిన ఓ నిర్దిష్ట ఫోటోని టార్గెట్ చేసిన కొందరు నెటిజెన్లు.. విరాట్ కోహ్లీ ముసలాడిలా తయారయ్యాడని అతడి వయసు పెరగడాన్ని అపహాస్యం చేస్తూ చెత్త వ్యాఖ్యలు చేశారు.

కోహ్లీపై ట్రోలింగ్:

విరాట్ కోహ్లీ తన 20 ల నాటిలా కనిపించడం లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ లోని ఓ పేజ్ మాత్రం.. ” వద్దురా.. సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటారా.. డోంట్ మ్యారీ.. బీ హ్యాపీ” అంటూ అక్కినేని నాగార్జున పాటకు సంబంధించిన ఫోటో ని.. విరాట్ కోహ్లీకి ఆపాదించింది.

Also Read: CHRIS GAYLE: 400 రన్స్ చేయకపోవడంపై గేల్ ఫైర్…అసలు ముల్డర్ సిగ్గుందా !

దీంతో ఈ ఫోటో చూసిన కొంత మంది నెటిజెన్లు నవ్వుకుంటుంటే.. మరికొంతమందికి మాత్రం.. ఈ చూడ చక్కనైన జంటపై ఇలాంటి పోస్ట్ లు చేయకండి అంటూ మండిపడుతున్నారు. విరాట – అనుష్క జంటను ఎంతోమంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారని కామెంట్స్ చేస్తున్నారు. సాధారణ వ్యక్తులైనా, సెలబ్రిటీలైనా.. సహజంగా వయసు పెరగడం, శరీరంలో మార్పులు రావడం అనేది అనివార్యం. అలాంటి ప్రక్రియలను అపహాస్యం చేయడం సరికాదని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×