E-Paper
Advertisement

PSL’s 2025 motorbike: IPL ముందు PSL దేనికి పనికిరాదు… ఇక్కడ కార్లు ఇస్తే… అక్కడ స్కూటర్లు.. ఇదేం కర్మ రా

PSL’s 2025 motorbike: IPL ముందు PSL దేనికి పనికిరాదు… ఇక్కడ కార్లు ఇస్తే… అక్కడ స్కూటర్లు.. ఇదేం కర్మ రా

PSL’s 2025 motorbike: పాకిస్తాన్ సూపర్ లీగ్ పదవ సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ లీగ్ లో ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ముగిసాయి. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో పోటీపడేందుకు పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రయత్నిస్తోంది. ప్రతి విషయంలోనూ ఐపీఎల్ ని కాపీ చేస్తూ నవ్వుల పాలవుతుంది. ఐపీఎల్ ఆడేందుకు దేశ విదేశీ ఆటగాళ్లు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కూడా కొంతమంది విదేశీ ఆటగాళ్లు ఆడుతుంటారు.

 

ప్రతి సంవత్సరం ఈ లీగ్ ఫిబ్రవరి నుండి మార్చి వరకు జరుగుతుంది. అయితే కొన్ని కారణాలవల్ల పాకిస్తాన్ సూపర్ లీగ్ ఏప్రిల్ కి మారింది. ఏప్రిల్ 11న ప్రారంభమైన ఈ పిఎస్ఎల్ పదవ ఎడిషన్ కి ప్రేక్షకుల కొరత ఏర్పడింది. ఈ లీగ్ లో కొంతమంది స్టార్ క్రికెటర్లు ఆడుతున్నప్పటికీ.. ప్రేక్షకులు స్టేడియానికి రావడం లేదు. అయితే ఈ రెండు లీగ్ ల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం మ్యాచ్ లు లేదా లీగ్ లో వెచ్చిస్తున్న డబ్బుల గురించి మాత్రమే కాక.. పీఎస్ఎల్ కూడా ఐపీఎల్ తో పోటీపడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

ఇటీవల కరాచీలో జరిగిన ఓ మ్యాచ్ లో వింత అనుభవం ఎదురైంది. దీంతో నెటిజెన్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ ని ఎగతాళి చేయడం ప్రారంభించారు. ఈ లీగ్ లోని 3వ మ్యాచ్ ముల్తాన్ సుల్తాన్స్ – కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కరాచీ కింగ్స్ కి చెందిన “జేమ్స్ విన్స్” 43 బంతుల్లో 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ కి జేమ్స్ విన్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. అయితే ఆశ్చర్యకరంగా గౌరవ సూచకంగా అతనికి ఒక హెయిర్ డ్రైయర్ ని బహుమతిగా ఇచ్చారు.

ఈ వీడియోని కరాచీ కింగ్స్ తమ అధికారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా.. అభిమానులు పాకిస్తాన్ సూపర్ లీగ్ ని ఎగతాళి చేయడం ప్రారంభించారు. గల్లీ క్రికెట్ లో గెలిచిన జట్టుకు ఇంకా మంచి బహుమతి ఇస్తారని పాకిస్తాన్ సూపర్ లీగ్ ని ఎగతాలి చేశారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన వారికి కార్ ని బహుమతిగా ఇస్తూ ఉండడం చూస్తుంటాం. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ లో మాత్రం ఓ టూ వీల్లర్ ని {PSL’s 2025 motorbike} బహుమతిగా ఇస్తున్నారు.

 

ఆదివారం రోజు లాహోర్ – క్యూట్ట జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతిగా ఇచ్చే టూ వీలర్ ఫోటో వైరల్ గా మారింది. దీంతో మరోసారి పాకిస్తాన్ పరువు పోయింది. ఈ నేపథ్యంలో నటిజెన్లు మరోసారి పాకిస్తాన్ సూపర్ లీగ్ ని ఎగతాళి చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో పోటీపడి పాకిస్తాన్ తన పరువును పూర్తిగా తీసుకుంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×