E-Paper

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు భారీగా పెరిగిన జీతాలు..ఏకంగా 500 శాతం ?

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు భారీగా పెరిగిన జీతాలు..ఏకంగా 500 శాతం ?
Advertisement

Pakistan New Central Contracts:   పాకిస్తాన్ క్రికెటర్లకు బంపర్ ఆఫర్ తగిలింది. తాజాగా కొత్త సెంట్రల్ కాంట్రాక్టు జీతాలను ( PAKISTAN CRICKETERS NEW CENTRAL CONTRACT ) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెటర్ల ( PAKISTAN CRICKETERS SALARIES) జీతాలు భారీగా పెరిగినట్లు కూడా తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. టెస్టులు, వన్డేలు, టి20 లు, రంజీలు ఆడే ప్లేయర్లను డివైడ్ చేస్తూ.. ఈ సెంట్రల్ కాంట్రాక్టు జీతాలను ఈ సంవత్సరం కోసం సిద్ధం చేసిందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. రేపు లేదా ఎల్లుండి అధికారికంగా దీనిపై ప్రకటన కూడా ఉండన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: ఇక చాలు ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్లి, ఐపీఎల్ ఆడుకో…వైభ‌వ్ కు లంక మాజీల వార్నింగ్

భారీగా పెరిగిన పాకిస్తాన్ క్రికెటర్ల జీతాలు

Advertisement

ఇండియా చేతిలో ప్రతిసారి చావు దెబ్బ తింటున్న పాకిస్తాన్ క్రికెటర్లకు ఆ దేశానికి సంబంధించిన క్రికెట్ బోర్డు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2026-27 సంవత్సరంకు గాను సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్ల జీతాలను నాలుగు విభాగాలుగా డివైడ్ చేసి.. ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఈ సెంట్రల్ కాంట్రాక్టు ప్రకారం టెస్ట్ ప్లేయర్లకు PKR 4.8 కోట్లు ఏడాదికి రానున్నాయి. అంటే దాదాపు ఒక్కో ఆటగాడికి రూ.1.44 కోట్లు రానున్నాయి. అలాగే టెస్టులతో పాటు వన్డేలు ఆడే ప్లేయర్లకు PKR 6 కోట్లు సంవత్సరానికి ఇవ్వనున్నారు. వన్డేలతో పాటు టి20 లు ఆడే క్రికెటర్లకు PKR 2.16 కోట్లు లభించనున్నాయి. టి20లతో పాటు లీగ్ మ్యాచ్లు ఆడే వాళ్లకు PKR 1.8 కోట్లు దక్కుతాయి. అలాగే ఒక్కో టెస్ట్ ఆడితే మ్యాచ్ ఫీజు కింద PKR 15 లక్షలు ద‌క్కనున్నాయి. అంటే ఇండియ‌న్ రూపాయ‌ల‌లో రూ.5 ల‌క్ష‌లువ‌స్తాయి. ఒక్క వన్డే ఆడితే PKR 7.5 లక్షలు, టి20 లకు PKR 5 లక్షలు చొప్పున అందించనున్నారు.

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు ఏకంగా 500 శాతం బోన‌స్

ఐసీసీ నుంచి వచ్చే వార్షిక ఆదాయంలో మూడు శాతం వాటాను సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. అంతేకాదు ఐసీసీ టోర్నమెంట్లు ఆడే వాళ్లకు బోనస్ లు కూడా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఒకవేళ ఐసీసీ టోర్నమెంట్ గెలిస్తే 500% మ్యాచ్ ఫీజు బోనస్ ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ గెలిస్తే 300% బోనస్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో పాకిస్తాన్ క్రికెటర్లు సంబరాలు చేసుకుంటున్నారు. వచ్చే ఐసీసీ టోర్నమెంటులో కచ్చితంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు టైటిల్ గెలవాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లాలని.. ఈ బోనస్ లు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: Kumar asangakkara On vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: బుడ్డోడు, బుడ్డోడు అంటూ వైభ‌వ్ ను రెచ్చ‌గొట్ట‌ద్దు…లంక ప్లేయ‌ర్ల‌కు సంగ‌క్క‌ర హెచ్చ‌రిక‌

Related News

Javed Miandad: వైభ‌వ్ 15 కాదు, 25 ఏళ్లు రా నాయ‌నా, అంద‌రినీ ఫూల్స్ చేసి గేమ్స్ ఆడుతున్నాడు

Tanveer Ahmed: బాబ‌ర్ గురించి రోనాల్డో ప‌దే ప‌దే నాకు ఫోన్ చేసి విసిగిస్తాడు

ఒరేయ్ గంభీర్..నీకు అస‌లు బుర్ర ఉందా? గిల్ ను ఓపెన‌ర్ గా ఎందుకు పంప‌లేదు

ఐపీఎల్ 2027 షెడ్యూల్ వ‌చ్చేసింది, ఈ సారి15 రోజులు ముందుగానే

బాబ‌ర్‌, గుల్ ఫిరోజా ఇద్ద‌రు పాకిస్తాన్ కు ప‌ట్టిన చీడ ప‌రుగులు..లైవ్ డిబేట్ లో ప‌రువు తీసిన క‌మ్రాన్‌

Ind vs Afg: ముఠా మేస్త్రిలాగా మెడ‌లో గిల్ వేసుకున్న‌ తెల్ల‌టి గుడ్డ ఏంటి?

పాకిస్తాన్ కొంప‌ముంచిన ర‌నౌట్…ఫాతిమా కోసం నష్రా సంధు త్యాగం

×