E-Paper
Advertisement

Manu Bhaker: ఢిల్లీలో మను బాకర్ కి ఘన స్వాగతం.. మళ్లీ పారిస్ కి ప్రయాణం

Manu Bhaker: ఢిల్లీలో మను బాకర్ కి ఘన స్వాగతం.. మళ్లీ పారిస్ కి ప్రయాణం
Advertisement

Olympic Medalist Manu Bhaker At Delhi Airport(Sports news today): పారిస్ ఒలింపిక్స్ నుంచి ఆటలైపోయిన క్రీడాకారులు ముగింపు ఉత్సవాల వరకు ఉంటారు. అయితే భారత దేశానికి రెండు కాంస్య పతకాలు తీసుకొచ్చిన మను బాకర్ మాత్రం ముందుగా ఢిల్లీ వచ్చింది. తనతో పాటు కోచ్ జస్పాల్ రాణా కూడా ఉన్నారు. అయితే ఢీల్లీ ఎయిర్ పోర్టులో మనుబాకర్ కి ఘన స్వాగతం లభించింది. క్రీడాఉన్నతాధికారులు తరలివచ్చారు. అభిమానులు వేలాదిగా వచ్చి పుష్పగుచ్ఛాలు అందించారు.

మనుబాకర్ ఎంతో సంతోషంగా వాటిని స్వీకరించారు. అనంతరం కారులో ర్యాలీగా బయలుదేరారు. భరతమాత ముద్దు బిడ్డ సగర్వంగా భారత్ లో అడుగుపెట్టింది. అనే నినాదాలు హోరెత్తిపోయాయి. రహదారి పొడవునా ఫ్ల కార్డులతో ప్రజలు స్వాగతం పలికారు. కోచ్ జస్పాల్ రాణా తండ్రి నారాయణ్ సింగ్ రాణా మాట్లాడుతూ తను నా కొడుకని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని తెలిపాడు.

Advertisement

Also Read: టీమ్ ఇండియా.. గెలుస్తుందా?: నేడు శ్రీలంకతో చావో.. రేవో!

ముందుగా వచ్చిన మనుబాకర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలకు శనివారం మళ్లీ వెళ్లనుంది. భారత పతకాన్ని పట్టుకునే అరుదైన అవకాశం తనకే దక్కింది. ఈ సమయంలో కేంద్ర క్రీడాశాఖా మంత్రిని కలవనుంది. అయితే మూడో పతకం త్రటిలో తప్పిపోయింది. లేదంటే ముచ్చటగా మూడు పతకాలతో భారత ఒలింపిక్స్  చరిత్రలో నూతనాధ్యాయాన్ని లిఖించేది. ఇప్పుడు కాంస్యంతో మెరిసిన మను వచ్చే ఒలింపిక్స్ నాటికి స్వర్ణాలతో మురిపిస్తుందని అభిమానులు అంటున్నారు.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×