PSL 2026 Final: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) విజేతగా బాబర్ ఆజం ప్రాతినిధ్యం వహిస్తున్న పెషావర్ జల్మీ నిలిచిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కింగ్స్ మెన్ వర్సెస్ పెషావర్ జల్మీ ( Peshawar Zalmi vs Hyderabad Kingsmen, Final,) జట్ల మధ్య ఆదివారం రోజున లాహోర్ లోని గడాఫీ స్టేడియం (Gaddafi Stadium, Lahore) వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన బాబర్ సేన, ఏకంగా ఐదు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. దీంతో 9 సంవత్సరాల తర్వాత మరోసారి ఛాంపియన్ అయింది పెషావర్ జల్మీ. ఇది ఇలా ఉండగా ఈ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకులు ఎవరూ రాలేదని.. దారుణంగా ట్రోలింగ్ కూడా మొదలైంది.
Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో మరో అరాచకం.. డబ్బులు లేక ఆంటీలతో క్లీన్ చేయిస్తున్నారు, దొంగల్లా దూరేస్తున్నారు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో పెషావర్ జల్మీ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ ( Peshawar Zalmi vs Hyderabad Kingsmen, Final,) జట్లు తలపడ్డాయి. అయితే లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకులు పెద్దగా రాలేదని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. 40 వేల కెపాసిటీ వరకు ఉన్న లాహోర్ స్టేడియానికి కేవలం 5000 మంది అభిమానులు వచ్చి మ్యాచ్ తిలకించాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. స్టేడియానికి సంబంధించిన అన్ని గేట్లు ఓపెన్ చేసినప్పటికీ కూడా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఎవరు ఆసక్తి చూపించలేదట. దీంతో పాకిస్తాన్ పరువు గంగలో కలిసిందని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు వాళ్ల దేశంలోనే ఆదరణ కరువైందని ట్రోల్స్ చేస్తున్నారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) ఫైనల్ మ్యాచ్ కు కేవలం 5000 మంది వచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా నేపథ్యంలో… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ సందర్భంగా లాహోర్ స్టేడియానికి 32,461 మంది హాజరైనట్లు వెల్లడించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. ఈ స్థాయిలో అభిమానులు రావడం సరికొత్త రికార్డు అంటూ వెల్లడించింది. గడాఫీ స్టేడియం మొత్తం నిండిపోయిందని వ్యాఖ్యానించింది. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ( Pakistan Pm Sharif) కూడా ఈ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చారు. కాసేపు మ్యాచ్ తిలకించిన తర్వాత వెళ్ళిపోయారు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్.
Also Read: Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండగా రొమాన్స్..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైరల్
🚨 BIG EMBARRASSMENT FOR PSL
Pakistan Cricket Board opened the gates for the final match between Peshawar Zalmi and Hyderabad Kingsmen. But barely 5,000 spectators turned up for the final.
Clearly, watching cricket is not a priority for Pakistanis. Basic amenities like food… pic.twitter.com/Qt4LVNKIop
— Brutal Truth (@sarkarstix) May 3, 2026