Tanveer Ahmed: జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రేపటి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పసికూన ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ చేతుల్లో వైట్ వాష్ అయింది టీమిండియా. ఇక ఇప్పుడు ఎలాగైనా జింబాబ్వే పై గెలిచి పరువు నిలబెట్టుకునేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. జింబాబ్వే మైదానాలు కాబట్టి టీమిండియా రాణించడం చాలా కష్టమే. కాబట్టి ఎంతో ఆచి తూచి ఆడాల్సి ఉంటుంది. జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా సిరీస్ నేపథ్యంలో మూడు టి20 లో కూడా వైభవ్ అనడం గ్యారంటీ. సంజు శాంసన్ అందుబాటులో లేడు కాబట్టి.. అభిషేక్ శర్మతో ఓపెన్ గా వైభవ్ బరిలోకి దిగుతాడు. ఇలాంటి క్రమంలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పైన తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్. జింబాబ్వే మైదానాలలో కూడా వైభవ్ విఫలమవుతాడని హేళన చేస్తూ మాట్లాడారు.
జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రేపటి నుంచి టి20 సిరీస్ జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ తన రివ్యూ ఇచ్చారు. ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయినట్లుగానే జింబాబ్వే చేతిలో కూడా టీమిండియా ఓడిపోవడం గ్యారంటీ అని హెచ్చరించారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా మళ్లీ విఫలమవుతాడని తేల్చి చెప్పారు. ఐపీఎల్ మైదానాలలో తప్ప వైభవ్ సూర్యవంశీకి విదేశాల్లో ఆడే దమ్ము లేదని పరువు తీశారు.
జింబాబ్వేలో ఫ్లాట్ మైదానాలు ఉంటే తప్ప టీమిండియా క్రికెటర్లు ఎవడు కూడా సరిగ్గా ఆడరని హేళన చేశారు. అలా కాదని 15 ఏళ్ల కుర్రాడు వైభవ్, జింబాబ్వే పై సెంచరీ చేసి చూపిస్తే తాను దేనికైనా సిద్ధమన్నారు. అవసరమనుకుంటే లాహోర్ వీధుల్లో బట్టలు లేకుండా తిరుగుతానని సవాల్ విసిరారు. దీంతో వైభవ్ పై తన్వీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ అద్భుతమైన ఆటగాడని కితాబ్ ఇచ్చారు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా. అందరూ అతన్ని చిన్నచూపు చూస్తున్నారు… కానీ మేము మాత్రం అతడిని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తామన్నారు. ఇంగ్లాండ్ గడ్డపై విఫలం అయ్యాడని ఆ కుర్రాడిని తక్కువగా అంచనా వేయకూడదని… తమపై అద్భుతంగా ఆడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇది ఇలా ఉండగా జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రేపటి నుంచి మూడు టి20 లో సిరీస్ షురూ అవుతుంది. 23వ తేదీ అంటే రేపు మొదటి టి20 మ్యాచ్ జరగనుండగా… 25 అలాగే 26 తేదీలలో జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా మధ్య వరుసగా రెండు టీ20 లు జరుగుతాయి. ఆ తర్వాత మళ్లీ ఇండియాకు చేరుకొని ఉంది టీమిండియా.