Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) ప్రారంభానికి కౌంట్ డౌన్ షురూ అయింది. మార్చి 28వ తేదీన ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అంటే మరో ఎనిమిది రోజుల్లోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ షురూ అవుతుందన్నమాట. అయితే ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ పైన తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టోర్నమెంట్ బోగస్ లీగ్ అని బాంబు పేల్చారు. అదే సమయంలో ఐపిఎల్ టోర్నమెంట్ లో బాబర్ ఆజం ఉండి ఉంటే, దాదాపు 50 కోట్లు వేలంలో పలికే వాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబర్ ఆజం ( Babar Azam) లాంటి ప్లేయర్లు ఇండియాలో లేరని.. ఈ నేపథ్యంలో అతను ఐపీఎల్ లో ఉంటే అందరి కంటే ఎక్కువ ధర పలికేవాడని తెలిపారు. దీంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండియాలో బాబర్ ఆజం విపరీతమైన ఫాలోయింగ్ ఉందని వెల్లడించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో అతడు ఆడితే చూడాలని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నట్లు వివరించారు. అయితే ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో అతనికి అవకాశం రావడం లేదని మండిపడ్డారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో బాబర్ ఆజం లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బాబర్ ఆజం ఆటను ఐపీఎల్ టోర్నమెంట్ లో ఇండియన్స్ చూడకపోవడం దురదృష్టకరమని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఐపీఎల్ టోర్నమెంట్ లో బాబర్ ఆజం ఆడి ఉంటే, 50 కోట్ల వరకు వేలంలో ధర పలికేవాడని బాంబు పేల్చారు తన్వీర్ అహ్మద్. దీంతో బాబర్ ఆజం ఫైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
పాకిస్తాన్ క్రికెట్లో బాబర్ ఆజం ( Babar azam) పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా ఉంది. వరుస వైఫల్యాలు నేపథ్యంలో కెప్టెన్సీ ని కోల్పోయిన బాబర్ ఆజం, జట్టులో కూడా స్థానం దక్కించుకోలేకపోతున్నాడు. ర్యాంకింగ్స్ లో కూడా దిగజారిపోయాడు బాబర్ ఆజం. అలాంటి ప్లేయర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడాలని తన్వీర్ అహ్మద్ తీసిన వ్యాఖ్యలపై ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==