Pakistan fans On Mohsin Naqvi : ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య 3 టీ20 ల సిరీస్ కొనసాగుతోంది. ఈ సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్ లు వరుసగా గెలిచింది టీమిండియా. రేపు మూడవ టి20 జరగనుంది. ఇందులో కూడా టీమిండియా విజయం సాధించి, ఆఫ్ఘనిస్తాన్ జట్టును వైట్ వాష్ చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో మొహ్సిన్ నఖ్వీపై పాకిస్తాన్ అభిమానులే దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. గెలవని ట్రోఫీలు చోరీ చేయడం కాదు… దమ్ముంటే అభిషేక్ శర్మ బ్యాట్లను లేపేయాలని సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు పాకిస్తాన్ అభిమానులు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పేజీ కూడా క్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ప్రస్తుతం టి20 సిరీస్ జరుగుతోంది. అయితే ఈ సిరీస్ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఊచకోత కోస్తున్నాడు. మొదటి టీ20 లో సెంచరీ మిస్ చేసుకున్న అభిషేక్ శర్మ… రెండో మ్యాచ్ లో అర్థ సెంచరీ మిస్ చేసుకున్నాడు. దాటిగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. అతని బ్యాటింగ్ పై తాజాగా పాకిస్తాన్ అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. అభిషేక్ శర్మ బ్యాట్ లో AI చిప్స్ కంటే ప్రమాదకరమైన వస్తువులు పేర్కొంటున్నారు. అందుకే అభిషేక్ శర్మ అవలీలగా సిక్సర్లు, బౌండరీలు బాదుతూ మ్యాచ్ గెలిపిస్తున్నాడని పేర్కొంటున్నారు.
ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి కీలక సూచనలు చేస్తున్నారు పాకిస్తాన్ అభిమానులు. ఇక పైన ఆసియా కప్ ట్రోఫీలు చోర్ చేయడం కాదు.. దమ్ముంటే అభిషేక్ శర్మ బ్యాట్లను తీసుకురా ! చురకలు అంటిస్తున్నారు. అభిషేక్ శర్మ బ్యాట్లు వాడితే మాత్రం… పాకిస్తాన్ వరుసగా విజయాలను అందుకుంటుందని పేర్కొంటున్నారు. తద్వారా పాకిస్తాన్ వరల్డ్ నెంబర్వన్ జట్టు అవుతుందని కూడా స్పష్టం చేస్తున్నారు. మొహ్సిన్ నఖ్వీ రియల్ హీరో కావాలంటే, అభిషేక్ శర్మ బ్యాట్లను లేపేయాలని చెబుతున్నారు.
2025 పురుషుల ఆసియా కప్ టోర్నమెంట్ సందర్భంగా టీమిండియా చాంపియన్ అయింది. ఆ సమయంలో ఇండియాకి ఇవ్వాల్సిన ట్రోఫీని తన దగ్గరే పెట్టుకున్నాడు మొహ్సిన్ నఖ్వీ. తాజాగా మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా కూడా టీమిండియానే ఛాంపియన్ గా నిలిచింది. ఇప్పుడు కూడా మొహ్సిన్ నఖ్వీ దుర్మార్గంగా వ్యవహరించి… ఈ టైటిల్ కూడా లేపేసాడు. తన కార్యాలయంలోనే రెండు ట్రోఫీలు పెట్టుకుని.. డ్రామాలు చేస్తున్నాడు.