President Murmu plays badminton: నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉంటారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. సింపుల్గా చెప్పాలంటే క్షణం తీరిక లేకుండా గడుపుతారు. ఎప్పుడైనా రెస్ట్ దొరికితే రకరకాల పనుల్లో బిజీగా ఉంటారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బుధవారం రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. సైనా సహా పలువురు ఆటగాళ్లు పద్మ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. అక్కడే ఉన్న కల్చరల్ సెంటర్లో కాసేపు సైనాతో కలిసి బ్యాడ్మింటన్ ఆడారు రాష్ట్రపతి ముర్ము.
దీనికి సంబంధించిన వీడియోను రాష్ట్రపతి ముర్ము సోషల్మీడయాలో షేర్ చేశారు. ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం ఆటలు ఆడాలంటూ చిన్నారులకు రాష్ట్రపతి సందేశమిచ్చారుు. హర్ స్టోరీ- మై స్టోరీ లెక్చర్ సిరీస్లో భాగమంటూ రాసుకొచ్చారు.
ALSO READ: టీమిండియా కెప్టెన్గా హార్దిక్ పాండ్యా!
అటు సైనానెహ్వాల్ కూడా సంబంధిత ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బుధవారం తన జీవితంలో మరిచిపోలేని రోజని, తనతో కలిసి బ్యాడ్మింటన్ ఆడినందుకు రాష్ట్రపతి మామ్కి ధన్యవాదాలని రాసుకొచ్చిందామె.
#WATCH | President Droupadi Murmu played badminton with ace shuttler Saina Nehwal at the Badminton Court in Rashtrapati Bhavan, Delhi today.
(Video: Rashtrapati Bhavan) pic.twitter.com/sLmFqQSMtk
— ANI (@ANI) July 10, 2024