Ahmed Shahzad : సాధారణంగా క్రికెట్ లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భారత్ లో ఐపీఎల్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ కి ఉన్న ఆదరణ మరే క్రికెట్ కి లేదనే చెప్పవచ్చు. అయితే ఇండియాలో ఐపీఎల్ కి పోటీగా పాకిస్తాన్ పీఎస్ఎల్ తీసుకొచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకొచ్చిన పీఎస్ఎల్ అంతగా సక్సెస్ కాలేదనే చెప్పవచ్చు. ఐపీఎల్ కి ఉన్న క్రేజ్ తో పోల్చితే చాలా తక్కువ అనే చెప్పవచ్చు. అయినప్పటికీ కొంత మంది ఆటగాళ్లు పీఎస్ఎల్ లో ఆడితే.. మరికొందరూ ఐపీఎల్ లో ఆడుతున్నారు. ఎవ్వరికీ నచ్చినట్టు వాళ్లు ఆడుతున్నారు. అయితే పీఎస్ఎల్ గురించి పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : KL Rahul : గిల్ కొంపముంచిన మెడనొప్పి.. వన్డేల్లో పర్మనెంట్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ?
అతను చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అది ఏంటంటే..? PSL అంటే రిటైర్డ్, Un Sold ప్లేయర్ల టోర్నమెంట్ అయింది అని సెన్షేషన్ కామెంట్స్ చేశారు. PSL ఇప్పుడు రిటైర్డ్ లీగ్, ఐపిఎల్లో తాము అమ్ముడుపోలేదని తెలిసినప్పుడు వారు పీఎస్ఎల్లో ఆడటానికి వస్తారని.. పాకిస్తాన్ క్రికెటర్ పీఎస్ఎల్ గురించి ఇలా కామెంట్స్ చేయడం ఏంటి..? రా మామ అంటూ సోషల్ మీడియాలో చర్చించుకోవడం విశేషం. ఇటీవలే పెళ్లి గురించి కూడా అహ్మద్ షెహజాద్ తన అభిప్రాయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. మరోసారి పెళ్లి చేసుకునే అవసరం తనకు లేదని తెలిపాడు. నేను ఇప్పటికే ఒకసారి వివాహం చేసుకున్నాను. నా భార్యతో చాలా సంతోషంగా ఉన్నాను. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగు సార్లు పెళ్లి చేసుకోవడం మత పరంగా సాధ్యమే. కానీ నాకు నా భార్యతో జీవితంలో అన్ని సరిపోతున్నాయి అని షెహజాబాద్ పేర్కొన్నారు.
తన చిన్ననాటి స్నేహితురాలు సనా అహ్మద్ను 2015లో వివాహం చేసుకున్న షెహజాద్, తన భాగస్వామి పట్ల నిజాయితీగా ఉండటమే ముఖ్యమని పేర్కొన్నాడు. మీ జీవిత భాగస్వామి మంచిది అయితే, వారికీ విలువ ఇవ్వాలిఅని మతం అనుమతించినా మీరు కొత్త సంబంధాలు నిర్మించకూడదు అని,ఇది హృదయాన్ని ముక్కలు చేయడంతో సమానం అంటూ తన అభిప్రాయాన్ని మరింత స్పష్టంగా వివరించాడు. క్రికెట్ విషయానికి వస్తే.. షెహజాద్ ప్రస్తుతం పాకిస్తాన్ జాతీయ జట్టులో చోటు లేకుండా పోయాడు. చివరిసారిగా 2019లో టీ20 మ్యాచ్ ఆడిన తర్వాత, అతను క్రికెట్కు దూరంగా ఉంటూ తన దృష్టిని యూట్యూబ్ కెరీర్ వైపు మళ్లించాడు. క్రికెట్ విశ్లేషణ వీడియోలు చేసుకుంటూ, పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై పలు విమర్శలు చేస్తూ, అభిమానులతో సమానమైన చర్చలకు దారితీస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా పీఎస్ఎల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం విశేషం.
Also Read : India vs Pakistan: జియో హాట్స్టార్ ను వేధిస్తోన్న పాకిస్తాన్..అందుకే టీ20 వరల్డ్ కప్ నుంచి ఔట్ ?