Ashwin Breaks Kumble Record in IND vs ENG 4th Test(Sports news today): భారత్ వర్సెస్ ఇంగ్లండ్ 4వ టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత స్పిన్ మాస్ట్రో రవిచంద్రన్ అశ్విన్.. అనిల్ కుంబ్లే ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. రాజ్కోట్లో జరిగిన 3వ టెస్టులో 500వ వికెట్ తీసిన అశ్విన్ ఇప్పుడు మరో చరిత్ర తన చరిత్ర సృష్టించాడు
భారత్ 307 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత ఇండియా స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ కుప్పకూలింది. కుంబ్లే 16 ఏళ్ల ఫీట్ను బ్రేక్ చేయడానికి అతను వరుస బంతుల్లో ఎడమచేతి వాటం ఓపెనర్ బెన్ డకెట్, ఓలీ పోప్లను అవుట్ చేశాడు.
పోప్ వికెట్ స్వదేశంలో అశ్విన్ 351వ వికెట్ కావడంతో.. భారతదేశంలో అత్యధిక టెస్టు వికెట్లు తీసుకున్న బౌలర్గా రికార్డు సృష్టించాడు. భారత్లో 350 టెస్టు వికెట్లు తీసిన కుంబ్లే రెండో స్థానంలో ఉన్నాడు. మరే ఇతర భారతీయుడు స్వదేశంలో 300 టెస్ట్ వికెట్లు సాధించలేదు. 265 వికెట్లతో హర్భజన్ సింగ్ కుంబ్లే తర్వాతి స్థానంలో ఉన్నాడు.
రాంచీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసుకున్న అశ్విన్ అత్యధిక ఫైఫర్స్ తీసుకున్న భారత బౌలర్లలో కుంబ్లే రికార్డును సమం చేశాడు. అశ్విన్, కుంబ్లే 35 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించారు. 132 మ్యాచుల్లో కుంబ్లే ఈ ఘనత సాధించగా.. అశ్విన్ కేవలం 99 మ్యాచుల్లోనే అతన్ని సమం చేశాడు.
Read More: జిమ్’బాబర్’ అంటూ ఫ్యాన్స్ హంగామా.. బాటిల్ విసరబోయిన పాక్ మాజీ కెప్టెన్.. వీడియో వైరల్..
భారత్లో అత్యధిక టెస్టు వికెట్లు:
రవిచంద్రన్ అశ్విన్: 355 వికెట్లు
అనిల్ కుంబ్లే: 350 వికెట్లు
హర్భజన్ సింగ్: 265 వికెట్లు
కపిల్ దేవ్: 219 వికెట్లు
రవీంద్ర జడేజా: 211 వికెట్లు
ముఖ్యంగా, స్వదేశంలో 350కి పైగా టెస్టు వికెట్లు తీసిన బౌలర్లు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. 800 టెస్టు వికెట్లు తీసిన శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ శ్రీలంకలో 493 వికెట్లు తీసుకున్నాడు. తన 700వ టెస్టు వికెట్కు (మొదటి ఇన్నింగ్స్ వరకు) దగ్గరలో ఉన్న ఇంగ్లాండ్ ఐకాన్ జేమ్స్ ఆండర్సన్ ఇంగ్లాండ్లో 434 వికెట్లు పడగొట్టగా, స్టువర్ట్ బ్రాడ్ ఇంగ్లాండ్లో 398 వికెట్లు తీశాడు.
అశ్విన్ ఇటీవల రాజ్కోట్ టెస్ట్లో 500 టెస్ట్ వికెట్ల మైలురాయిని సాధించాడు. 37 ఏళ్ల ఆటలో సుదీర్ఘమైన ఫార్మాట్లో 500 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏకైక భారతీయుడు మరియు తొమ్మిదో స్థానంలో నిలిచాడు.