BigTV English

Ban For RCB: ఫ్యాన్స్ కు బిగ్ షాక్… ఏడాది పాటు RCBపై బ్యాన్.. ఎన్ని ఏళ్ళు అంటే ?

Ban For RCB:  ఫ్యాన్స్ కు బిగ్ షాక్… ఏడాది పాటు RCBపై బ్యాన్.. ఎన్ని ఏళ్ళు అంటే ?

Ban For RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. మొట్టమొదటిసారిగా ఛాంపియన్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి బిగ్ షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై బ్యాన్ విధించేందుకు… భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్దలు సిద్ధమవుతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దాదాపు 11 మంది మరణించిన నేపథ్యంలో.. బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘోర ప్రమాదం జరిగినప్పుడు స్పందించకపోతే.. తమపై చెడ్డ పేరు వచ్చే ప్రమాదం పొంచి ఉందని.. బీసీసీఐ పెద్దలు ఆలోచన చేస్తున్నారట.


Also Read: Sharayu Kulkarni- Pant: మీ దుంపలు తెగ…ఈ జంపింగ్స్ ఏంట్రా… పంత్ తరహాలో మరో లేడీ సెలెబ్రేషన్స్

బెంగళూరు పై రెండేళ్ల బ్యాన్ ?


బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో 11 మంది బెంగళూరు అభిమానులు మరణించారు. మరో 33 మంది ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పదిమందికి ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అందులో ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి నేపథ్యంలోనే రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టుపై బ్యాన్ విధించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. రెండు సంవత్సరాలు లేదా ఒక సంవత్సరం పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పై బ్యాన్ విధించేందుకు ప్లాన్ చేస్తున్నారట. కొంతమంది ఏడాది పాటు బెంగళూరుపై బ్యాన్ విధిస్తే బాగుంటుందని.. సూచనలు చేస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఈ మేరకు మరో నాలుగు రోజుల్లోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై బ్యాన్ విధించేలా… చర్యలు తీసుకునేందుకు నిర్ణయం తీసుకోబోతున్నారు. కచ్చితంగా బ్యాన్ లేదా.. మరో నిర్ణయం అయినా తీసుకునే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. భారతదేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ తొక్కిసలాట ఘటన… హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో అంతర్జాతీయంగా.. దోషిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

తొక్కిసలాటలో 11 మంది మృతి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో ఛాంపియన్ అయిన తర్వాత బెంగళూరు అభిమానుల కోసం పరేడ్ నిర్వహించారు. మొన్న బుధవారం రోజున చిన్న స్వామి స్టేడియం దగ్గర పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 30000 కెపాసిటీ ఉన్న చిన్నస్వామి స్టేడియం దగ్గరికి 3 లక్షల మంది వచ్చారు. దీంతో పరిస్థితి… పూర్తిగా అదుపు తప్పింది. ఈ నేపథ్యంలో మొత్తం 11 మంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు మృతి చెందారు. మరో 33 మంది ఆసుపత్రి పాలయ్యారు. మృతి చెందిన కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే పరిహారం ప్రకటించింది.

Also Read: Vijay Mallya: తీసుకున్న రుణాలు కట్టిన విజయ్ మాల్యాపై ట్రోలింగ్.. ‘ఊ లా లాలా లే ఓ’ జింగిల్ సీక్రెట్ ఇదే!

Related News

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆట‌గాడు ఆటోగ్రాఫ్‌…!

BCCI : బీసీసీఐలో ప్ర‌క్షాళ‌న‌..కొత్త అధ్య‌క్షుడు ఇత‌నే.. ఐపీఎల్ కు కొత్త బాస్

Big Stories

×