E-Paper
Advertisement

Yashasvi Jaiswal Century: యశస్వి జైస్వాల్ సూప‌ర్ సెంచ‌రీ..స‌చిన్ రికార్డు బ‌ద్ద‌లు,భారీ స్కోర్ దిశ‌గా టీమిండియా

Yashasvi Jaiswal Century: యశస్వి జైస్వాల్ సూప‌ర్ సెంచ‌రీ..స‌చిన్ రికార్డు బ‌ద్ద‌లు,భారీ స్కోర్ దిశ‌గా టీమిండియా
Advertisement

Yashasvi Jaiswal Century: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ ( India vs West Indies, 2nd Test) జట్ల మధ్య ప్రస్తుతం రెండవ టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని అరుణ్ జెట్లీ మైదానంలో ( Arun Jaitley Stadium, Delhi ) ఈ మ్యాచ్ ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఇందులో టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి తగ్గట్టుగానే టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా యంగ్ కుర్రాడు యశస్వి జైష్వాల్ ( Yashasvi Jaiswal) సెంచరీ కూడా నమోదు చేశాడు. యశస్వి జైష్వాల్ సెంచరీ న‌మోదు చేయ‌గా, సాయి సుద‌ర్శ‌న్ హ‌ఫ్ సెంచ‌రీ చేశాడు. దీంతో ఒకే ఒక్క వికెట్ కోల్పోయిన టీమిండియా 203 ప‌రుగులు చేసింది. ఇదే ఊపు కొన‌సాగితే, ఇవాళ 400ల‌కు పైగా ప‌రుగులు చేస్తుంది టీమిండియా.

Also Read: MS Dhoni: CSK ఫ్యాన్స్ కు ధోని గుడ్ న్యూస్‌….రూ.325 కోట్లతో భారీ స్కెచ్‌, కాళ్లు మొక్కిన కుర్రాడు

యశస్వి జైస్వాల్ సూప‌ర్ సెంచ‌రీ

Advertisement

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మొదటి టెస్ట్ లో పెద్దగా రాణించకపోయిన యశస్వి జైస్వాల్, ఇవాల్టి మ్యాచ్ లో మాత్రం సెంచరీ నమోదు చేశాడు. 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు యశస్వి జైస్వాల్. ఇందులో 16 బౌండరీలు ఉన్నాయి. దీంతో తన టెస్టు కెరీర్ లో ఏడవ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ నమోదు చేయడమే కాకుండా తన టెస్ట్ క్రికెట్ లో 3,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

సచిన్ రికార్డు బద్దలు కొట్టిన యశస్వి జైస్వాల్

వెస్టిండీస్ జట్టుపై సెంచరీ నమోదు చేసుకున్న 23 ఏళ్ల యశస్వి జైస్వాల్… సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెటర్ రికార్డు కూడా బద్దలు కొట్టాడు. ఆడిన 48 ఇన్నింగ్స్ లోనే, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ కు చేరువయ్యాడు. 48 ఇన్నింగ్స్ లలో టీమిండియా తరఫున ఎక్కువ సార్లు 50 కి పైగా పరుగులు చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు యశస్వి జైస్వాల్. ఇలా గతంలో 21 సార్లు రాహుల్ ద్రావిడ్ 50 కి పైగా 48 ఇన్నింగ్స్ లలో పరుగులు చేశాడు. ఆ తర్వాత సునీల్ గవాస్కర్ 48 ఇన్నింగ్స్ లలో 20 సార్లు 50 కి పైగా పరుగులు చేశాడు.

Advertisement

అటు సచిన్ టెండూల్కర్ 19 సార్లు ఈ ఫీట్ అందుకోగా, తాజాగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు యశస్వి జైస్వాల్. 19 ఇన్నింగ్స్ ల‌లో 50కి పైగా 48 ఇన్నింగ్స్ లలో ప‌రుగులు చేశాడు యశస్వి జైస్వాల్. సచిన్ టెండూల్క‌ర్‌ రికార్డు బద్దలు కొట్టడమే, 23 సంవత్సరాల లో సెంచరీ నమోదు చేసి మరో చరిత్ర సృష్టించాడు ఈ కుర్రాడు. 23 సంవత్సరాల వయసులో సచిన్ టెండూల్కర్ 11 సెంచరీలు చేస్తే, యశ‌స్వీ జైశ్వాల్‌ ఏడు సెంచరీలు చేసి దుమ్ము లేపాడు. అంటే సచిన్ త‌ర‌హాలోనే అద్భుతంగా ఆడుతున్నాడు అన్నమాట.

Also Read: IND-W vs SA-W: కొంప‌ముంచిన‌ హర్మన్.. ద‌క్షిణాఫ్రికా విక్ట‌రీ..పాయింట్ల ప‌ట్టిక‌లో టీమిండియా సేఫ్‌

 

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×