E-Paper
Advertisement

Rohit Sharma: ఆ విషయం తెలుసు.. బాధపడను.. కచ్చితంగా సెంచరీ కొడతా!

Rohit Sharma: ఆ విషయం తెలుసు.. బాధపడను.. కచ్చితంగా సెంచరీ కొడతా!
Advertisement

Rohit Sharma: రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌కు టీమిండియా చుక్కలు చూపించింది. భారత ఆటగాళ్లు తమ బౌలింగ్‌తో అదరగొట్టారు. మ్యాచ్ ఆరంభంలోనే మూడు వికెట్లు తీసి సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కివీస్ బ్యాటర్లను వణికించాడు. అయితే భారత బౌలర్ల ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. టీమిండియా బౌలింగ్ గాడిన పడడం తమకు కలిసొచ్చే అంశం అని వెల్లడించాడు.

భారత బౌలర్లలో అసాధారణమైన ప్రతిభ, నైపుణ్యాలు ఉన్నాయని తెలిపాడు. గత ఐదు మ్యాచుల్లోనూ అద్భుత ప్రతిభ కనబర్చారని వెల్లడించాడు. జట్టులో ప్రతి ఒక్కరి ఆత్మ విశ్వాసం రెట్టింపైందని, జట్టును ఇలా చూడడం గొప్పగా ఉందని చెప్పాడు. తాను భారీ స్కోర్ చేయడం లేదనే విషయం తనకు తెలుసని.. ఈ విషయం గురించి తాను బాధపడడం లేదని అన్నారు. త్వరలో తన ఆట తీరును మార్చుకొని.. భారీ స్కోర్‌ను సాధిస్తానని వివరించాడు. ఇండోర్ వేదికగా జరిగే చివరి వన్డే విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని అన్నాడు.

Advertisement

ఇక రెండో వన్డేలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 108 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని 20.1 ఓవర్లలో భారత్ చేధించింది . దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ 51 పరుగులతో చెలరేగిపోయాడు. శుభ్‌మన్‌గిల్ (40*)తో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ 11, ఇషాన్ కిషన్ 8 పరుగులు చేశారు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×