E-Paper
Advertisement

Rohit Sharma Captaincy: డిప్రెష‌న్ లో రోహిత్ శ‌ర్మ‌..షాకింగ్ వీడియో వైర‌ల్‌

Rohit Sharma Captaincy:  డిప్రెష‌న్ లో రోహిత్ శ‌ర్మ‌..షాకింగ్ వీడియో వైర‌ల్‌

Rohit Sharma Captaincy:   టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. వన్డే కెప్టెన్సీ నుంచి అతన్ని తప్పించడంతో, టీమిండియా అభిమానులు చాలా బాధపడుతున్నారు. అతడు జట్టులో లేకపోతే అసలు మ్యాచ్ చూడాలని అనిపించదని పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఇందులో చాలా దీనంగా, డిప్రెషన్ లోకి వెళ్లినట్లు రోహిత్ శర్మ స్పష్టంగా కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read:  India Schedule: 2026 వ‌ర‌కు వ‌రుస‌గా మ్యాచ్ లే…ప్లేయ‌ర్ల‌కు రెస్ట్ కూడా లేదు..టీమిండియా కొత్త షెడ్యూల్ ఇదే

డిప్రెషన్ లో రోహిత్ శర్మ ( Rohit Sharma)

ఇండియా ( Team India )వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య త్వరలో జరగబోతున్న వన్డే క్రికెట్ కు సెలెక్ట్ అయిన రోహిత్ శర్మ కెప్టెన్సీ ని తొలగించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. రోహిత్ శర్మను పక్కకు పెట్టి గిల్ కు అప్పగించారు. ఈ వార్త బయటకు రాగానే టీమిండియా అభిమానులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏంటి ఇలా చేశారు? ODI వరల్డ్ కప్ 2027 టోర్నమెంటు వరకు రోహిత్ శర్మ ఆడతాడు అనుకుంటే… కెప్టెన్సీ లేకుండా చేశారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది.

విమానాశ్రయంలో దిగిన రోహిత్ శర్మ చాలా దీనంగా కనిపించాడు. డిప్రెషన్ లోకి వెళ్లినట్లు స్పష్టమవుతోంది. కెప్టెన్సీ తొలగించడంతో అతను చాలా బాధపడుతున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అయితే రోహిత్ శర్మ కనిపించగానే విలేకరులు అతని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య సిరీస్ కోసం ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు? కెప్టెన్సీ కోల్పోవడం పై మీ రియాక్షన్ ఏంటి? అని పలువురు జర్నలిస్టులు ప్రశ్నించారు. అయితే వాటికి సమాధానం ఇవ్వకుండా కాస్త ఆందోళన చెందుతూ వెళ్ళిపోయాడు రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఆస్ట్రేలియా టూర్ తర్వాత రిటైర్మెంట్

టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 19వ తేదీ నుంచి వన్డే సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ ని తీసేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇలాంటి నేపథ్యంలోనే అతడు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మధ్య 3 వన్డేలు ఆడిన తర్వాత అతడు రిటైర్మెంట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఇచ్చేందుకే సిద్ధమయ్యారట. యంగ్ క్రికెటర్లకే అవకాశం ఇవ్వాలన్న ధోరణితో ముందుకు వెళుతోంది బీసీసీఐ. అందుకే తప్పుకుంటే బెటర్ అని ఈ ఇద్దరు అనుకుంటున్నారట.

Also Read: Tazmin Brits: ఒకే ఏడాది 5 సెంచరీల‌తో రికార్డు…రాముడి అవ‌తారం ఎత్తిన సౌతాఫ్రికా లేడీ..అచ్చం కోహ్లీ లాగే

 

Related News

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

Big Stories

×