దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా ( India vs South Africa, 1st ODI) మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ సాధించాడు. 120 బంతుల్లో ఏకంగా 135 పరుగులు సాధించాడు విరాట్ కోహ్లీ. ఇందులో ఏడు సిక్సర్లతో పాటు 11 బౌండరీలు ఉన్నాయి. అయితే ఈ సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ తన స్టైల్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అయితే అప్పటికే వికెట్ కోల్పోయిన ఫ్యాన్స్ అలాగే టీమ్ ఇండియా క్రికెటర్లు డ్రెస్సింగ్ రూమ్ నుంచి చప్పట్లు కొడుతూ కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే కోహ్లీ సెంచరీ చేయగానే టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యాడు. ఓ బూతు పదం వాడుతూ, విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపాడు రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
అయితే ఈ వీడియో వైరల్ కావడంతో టీమిండియా అభిమానులు చాలా భిన్నంగా స్పందిస్తున్నారు. కోహ్లీ సెంచరీ చేయగానే గౌతమ్ గంభీర్ ను రోహిత్ శర్మ తిట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. మావోడు సెంచరీ చేశాడు.. ఇకనైనా నువ్వు మారు అంటూ గౌతమ్ గంభీర్ కు పరోక్షంగా రోహిత్ శర్మ కౌంటర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కూడా అద్భుతంగా రాణించాడు. కేవలం 51 బంతులలో 57 పరుగులు సాధించాడు రోహిత్ శర్మ ( Rohit Sharma). ఇందులో 3 సిక్సర్లు, 5 బౌండరీలు ఉన్నాయి. దీంతో తన వన్డే క్రికెట్ లో 352 సిక్సర్లు సాధించి, అఫ్రిది రికార్డ్ బద్దలు కొట్టాడు. అటు ఇవాళ్టి మ్యాచ్ లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, సచిన్ రికార్డ్ బద్ధలు కొట్టాడు. వన్డేలలో 52 సెంచరీలు చేసి, సచిన్ (51)ను వెనక్కి నెట్టాడు.
Rohit celebrating Kohli's century pic.twitter.com/x3CeWYv9yu
— Abhishek (@be_mewadi) November 30, 2025