E-Paper
Advertisement

Rohit Sharma’s ODS and Test Retirement Plans: 37ఏళ్ల రోహిత్ శర్మ.. ఎప్పుడు రిటైర్ కావాలి?

Rohit Sharma’s ODS and Test Retirement Plans: 37ఏళ్ల రోహిత్ శర్మ.. ఎప్పుడు రిటైర్ కావాలి?
Advertisement

Rohit Sharma has talked about his ODS and Test Retirement plans: 2007 లో వన్డేల్లో ఆరంగేట్రం చేసిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, తన కెరీర్ ప్రారంభించి నేటికి 17 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు తనకి 37 సంవత్సరాలు. మహా అయితే మరో మూడేళ్లు ఆడే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇండియా తరఫున అత్యధిక సంవత్సరాలు క్రికెట్ ఆడిన వారిలో సచిన్ టెండూల్కర్ (22 ఏళ్లు) ఉన్నాడు. తర్వాత హర్భజన్ (17 ఏళ్లు), అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్ (16 ఏళ్లు) ఇలా ఉన్నారు. ఈ లెక్కన చూసుకుంటే రోహిత్ శర్మకి టైమ్ దగ్గరపడిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్ పై మరి రోహిత్ శర్మ ఏమన్నాడో చూద్దామా…

తాజాగా డలాస్‌లో క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రోహిత్ శర్మ హాజరయ్యాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. అందులో భాగంగా రిటైర్మెంట్ పై రోహిత్ సమాధానం ఇచ్చాడు. ‘ఇంకొంత కాలం క్రికెట్ ఆడాలని అనుకుంటున్నా. అయితే సుదీర్ఘ ప్రాణాళికలేమీ లేవు’ అన్నాడు. అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డే, టెస్టు మ్యాచ్ లు, తర్వాత ఐపీఎల్‌లో కొనసాగనున్నాడు.

Advertisement

ఇంతకుముందు కూడా పలువురు రిటైర్మెంట్ పై అడిగిన ప్రశ్నకు పలు సందర్భాల్లో సమాధానమిచ్చాడు. ఇప్పుడు నా బ్యాటింగ్ మంచి రిథమ్ లో ఉంది. అది ఉన్నంతవరకు ఆడతానని అన్నాడు. లేదంటే ఒక ఫైన్ డే ఉదయం లేవగానే, నాకు క్రికెట్ పై ఇంట్రస్ట్ పోయిందని అనిపించిన క్షణం, మరో ఆలోచన లేకుండా గుడ్ బై చెప్పేస్తానని అన్నాడు. ఇటీవల టీ 20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం టీ 20ల వరకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. ఒకట్రెండు ఏళ్లలో జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతాడని అంటున్నారు.

Also Read: క్రికెట్ స్టేడియంలో పొగాకు యాడ్స్ వద్దు : కేంద్రం ఆలోచన

Advertisement

ఇకపోతే ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్ వయసు కూడా 37 సంవత్సరాలు కావడం విశేషం. ఇండియా నుంచి సచిన్ టెండూల్కర్ 40, సునీల్ గవాస్కర్ 38, శ్రీలంక నుంచి సనత్ జయసూర్య 41 ఏళ్లనాడు రిటైర్మెంట్ ప్రకటించారు. పాకిస్తాన్ నుంచి ఇమ్రాన్ ఖాన్, జియా ఉల్ హక్, షాహిద్ ఆఫ్రిది వీరందరూ 40 ఏళ్లు దాటించారు. క్రికెట్ జీవితంలో 37-40 మధ్య రిటైర్మెంట్ వయసుగా క్రికెట్ బోర్డులు పరిగణిస్తాయి.

అంతకుమించి ఆడుతుంటే మాత్రం, బోర్డులే ఆటగాళ్లను పక్కన పెడతాయి. లేదంటే ఫలానా సిరీస్ లో రిటైర్మెంట్ ప్రకటించమని అంతర్గతంగా వారికి చెబుతాయి. అది వింటే మంచి బెనిఫిట్స్ తో బయటపడతారని అంటారు. ఇదండీ సంగతి. ప్రస్తుతం విరాట్ కొహ్లీ 36, రోహిత్ శర్మ 37, రవీంద్ర జడేజా 35, మహ్మద్ షమీ 33 ఇలా వరుసగా రిటైర్మెంట్ క్యూ లో ఉన్నారు.

Tags

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×