BigTV English
Advertisement

Rohit – Nita Ambani: నీతా అంబానీ చాటింగ్‌..సీక్రెట్ గా తొంగిచూసిన రోహిత్ శ‌ర్మ‌..వీడియో వైర‌ల్‌

Rohit – Nita Ambani: నీతా అంబానీ చాటింగ్‌..సీక్రెట్ గా తొంగిచూసిన రోహిత్ శ‌ర్మ‌..వీడియో వైర‌ల్‌

Rohit – Nita Ambani: వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ముంబై వేదికగా జరిగిన నేపథ్యంలో చాలా మంది టీమిండియా మాజీ క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. రోహిత్ శర్మ ఫ్యామిలీతో పాటు నీతా అంబానీ కూడా మ్యాచ్ తిలకించేందుకు వచ్చారు. టీమిండియా గెలిచిన ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేశారు. అయితే ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నీతా అంబానీ మొబైల్ లో ఎవరితో చాటింగ్ చేస్తున్న నేపథ్యంలో… పక్కనే కూర్చున్న రోహిత్ శర్మ తొంగి తొంగి చూశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.


Also Read: Ind vs SA, Final: వ‌ర‌ల్డ్ క‌ప్ 2025 ఛాంపియ‌న్ గా టీమిండియా.. ప్రైజ్ మనీ ఎంతంటే, రూ.100 కోట్ల‌కు పైగానే ?

నీతా అంబానీ మొబైల్ తొంగి చూసిన రోహిత్ శర్మ

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( India Women vs South Africa Women, Final) మధ్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా రోహిత్ శర్మ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నీతా అంబానీ పక్కనే రోహిత్ శర్మ ఫ్యామిలీ కూర్చుంది. అయితే మ్యాచ్ చూసుకుంటూ ఉండగానే, ఎవ‌రితో దీనంగా నీతా అంబానీ చాటింగ్ చేస్తున్నారు. ఈ త‌రుణంలోనే రోహిత్ శ‌ర్మ ( Rohit Sharma) ఆమె ఫోన్ చూశారు.


నీతా మేడం ఎవ‌రితో చాటింగ్ చేస్తున్నారు..? ఆమె ఎందుకు అంత‌లా సీరియ‌స్ గా ఉంద‌ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఇందులో భాగంగానే నీతా అంబానీ ( Nita Ambani) మొబైల్ తొంగి తొంగి చూశాడు. ఈ సంఘ‌ట‌న వైర‌ల్ గా మారింది. ఇక నీతా అంబానీ చాటింగ్ లిస్ట్ చూసిన రోహిత్ శ‌ర్మ వీడియో కావ‌డంతో, నెటిజెన్స్ ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ పెడుతున్నారు. రోహిత్ శ‌ర్మ నువ్వు అలా చూడ‌క‌కూడ‌దు, ప‌క్క వాళ్ల ఫోన్లు చూడటం అతిపెద్ద నేర‌మే అంటూ ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప‌క్క‌న నీ భార్య ఉన్న కూడా అలా చూశావంటే, నిజంగా నువ్వు గ్రేట్ అంటున్నారు.

క‌న్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శ‌ర్మ‌

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నిన్న ఫైనల్ మ్యాచ్ జరగగా.. మనోళ్లు గెలిచారు. దీంతో మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ అందుకుంది టీం ఇండియా. అయితే ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత గ్రౌండ్ లోనే ఉన్న రోహిత్ శర్మ కాస్త ఎమోషనల్ అయ్యారు. 2023 సంవత్సరంలో నేను వరల్డ్ కప్ మిస్ అయ్యాను.. కానీ ఇప్పుడు మహిళల టీమిండియా అందుకుంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.

Also Read: Kane Williamson Retirement: రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన కేన్ మామ‌..ఇక అత‌ని శ‌కం ముగిసింది

?igsh=dDllZWhleTE3OHF0

 

Related News

Pratika Rawal: వీల్ చైర్ పైనే టైటిల్ అందుకున్న ప్రతీకా రావల్..గుండెలు పిండే ఫోటోలు వైర‌ల్‌

Smriti Mandhana: ప్రియుడి కౌగిలిలో స్మృతి మందాన‌… దారుణంగా ఆడుకుంటున్న ఫ్యాన్స్ ?

Hardik Pandya: ఛాంపియ‌న్ గా టీమిండియా.. ముంబై వీధుల్లో గంతులు వేసిన హ‌ర్ధిక్ పాండ్యా

Womens World Cup 2025: 1983లో క‌పిల్, 2024లో సూర్య.. ఇప్పుడు అమన్‌జోత్..ఈ 3 క్యాచ్ లు టీమిండియా రాత మార్చేశాయి

Womens World Cup 2025: క‌న్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శ‌ర్మ‌, ప‌డుకుని జెమిమా సెల్ఫీ, BCCI భారీ నజరానా

ICC Women’s World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు.. PM నుంచి CM వరకు అభినందనలు

Ind vs SA, Final: వ‌ర‌ల్డ్ క‌ప్ 2025 ఛాంపియ‌న్ గా టీమిండియా.. ప్రైజ్ మనీ ఎంతంటే, రూ.100 కోట్ల‌కు పైగానే ?

Big Stories

×