E-Paper
Advertisement

Virat Kohli: RCB ఫ్యాన్స్ కొంప‌ముంచిన కోహ్లీ..ఇక ఎన్ని డ‌బ్బులు పెట్టినా బొక్కే ?

Virat Kohli: RCB ఫ్యాన్స్ కొంప‌ముంచిన కోహ్లీ..ఇక ఎన్ని డ‌బ్బులు పెట్టినా బొక్కే ?

Virat Kohli:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో హోమ్ మ్యాచ్ లు ఆడకూడదని విరాట్ కోహ్లీ తో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం నిర్ణయం తీసుకుందట. విరాట్ కోహ్లీ మొదట ఈ నిర్ణయం తీసుకోగా, అతని అడుగుజాడల్లోనే నడవాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం కూడా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అంటే ఐపిఎల్ 2026 టోర్నమెంట్ సమయంలో చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుకు సంబంధించిన ఒక్క మ్యాచ్ కూడా జరగదు అన్నమాట. అటు ఐపీఎల్ కు సంబంధించిన ఏ ఒక్క మ్యాచ్ చిన్నస్వామి లో ఉండబోదు. త‌న హోం మ్యాచ్ ల‌ను ఇండోర్ లేదా రాయ్ పూర్ ఆడాల‌ని అనుకుంటోంద‌ట ఆర్సీబీ. దీంతో బెంగళూరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Sarfaraz Khan-Abhishek Sharma: అభిషేక్ శర్మ ఓవర్‌లో 6, 4, 6, 4, 6, 4..15 బాల్స్‌లో స‌ర్ఫ‌రాజ్ అర్ధ సెంచ‌రీ

RCB అభిమానులకు డబ్బులు బొక్క..?

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో చిన్న స్వామి స్టేడియం వేదికగా మ్యాచ్లకు ఇంకా భారత క్రికెట్ నియంత్రణ మండలి పర్మిషన్ ఇవ్వలేదు. త్వరలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు కర్ణాటక సర్కార్ కూడా పర్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో బెంగుళూరు అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. వాళ్లు పర్మిషన్లు ఇవ్వడం కాదు.. అసలు చిన్నస్వామి స్టేడియంలో తాము ఆడబోమని, విరాట్ కోహ్లీ తో పాటు రాయల్ చాలెంజెస్ బెంగళూరు యాజమాన్యం నిర్ణయం తీసుకుందట. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ గెలిచిన తర్వాత విజయోత్సవ వేడుకల సందర్భంగా, తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మొత్తం 11 మంది బెంగళూరు అభిమానులు మరణించారు. అయితే ఇలాంటి సంఘటనలు మళ్లీ జరిగే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో చిన్న స్వామి స్టేడియంలో ఆడబోమని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందట. మళ్లీ ఏదైనా ప్రమాదం జరిగితే నెగెటివిటీ బాగా పెరిగిపోతుందని ఈ నిర్ణయానికి వచ్చిందట బెంగళూరు యాజమాన్యం.

ఐపీఎల్ 2026 లో బెంగళూరుకు కొత్త యాజమాని ?

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభమైన మధ్యలోనే ఆ జట్టుకు కొత్త ఓనర్ రాబోతున్నాడు. ప్రస్తుత పరిస్థితులలో బెంగళూరు జట్టును నడిపించలేమని పాత యాజమాన్యం డియాజియో ( Diageo)
ఇప్పటికే విక్రయించేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో మార్చి ఎండింగ్ సమయంలో ఈ జట్టుకు కొత్త యజమాని రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. మార్చి 15వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ముందుగా ప్రారంభించాలని అనుకున్నారు. కానీ చివరికి మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభించాలని డిసైడ్ అయ్యారట. మే 31వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయినట్లు చెబుతున్నారు.

Also Read: Shivang Kumar: SRHలో మ‌రో మిస్ట‌రీ మెండిస్..రూ.30 ల‌క్ష‌ల‌కే కొనేసిన కావ్య‌పాప‌, 5 వికెట్ల‌తో ఇర‌గ‌దీసిన‌ శివంగ్

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×