E-Paper
Advertisement

Sanjiv Goenka: సంజీవ్ గోయెంకా విజ‌యం వెనుక రహస్య శక్తి…ఈ ఫోటో సీక్రెట్ ఇదే

Sanjiv Goenka: సంజీవ్ గోయెంకా విజ‌యం వెనుక రహస్య శక్తి…ఈ ఫోటో సీక్రెట్ ఇదే
Advertisement

Sanjiv Goenka:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. మొదటి మ్యాచ్ ఓడిపోయిన లక్నో, ఉప్పల్ వేదికగా హైదరాబాద్ ను చిత్తు చేసింది. హైద‌రాబాద్ పై 5 వికెట్ల తేడాతో విక్ట‌రీ అందుకుంది. ఈ తరుణంలో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా చేసుకున్న సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి. మ్యాచ్ గెలిచిన తర్వాత కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు సంజీవ్ గోయెంకా. అయితే ఆయన విజయం వెనక తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్నట్లు వీడియో వైరల్ గా మారింది. స్వయంగా ఈ విషయాన్ని సంజీవ్ గోయెంకా పేర్కొన్నట్లు వీడియో బయటకు వచ్చింది. ఆ వెంకటేశ్వర స్వామి కారణంగానే హైదరాబాద్ పై లక్నో గెలిచిందని ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read: Shardul Thakur overthrow: శార్దూల్ ఠాకూర్ ఓవర్‌త్రో వివాదం..4 ప‌రుగులు కూడా వ‌ద‌ల‌లేదు, ముంబై, ఢిల్లీ మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం !

లక్నో సూపర్ జెయింట్స్ విజయం వెనక వెంకటేశ్వర స్వామి

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో లక్నో సూప‌ర్ జెయింట్స్‌ విజయాల బాట పట్టింది. గత సీజన్ లో తేలిపోయిన లక్నో, ఈ సారి ఇరగదీస్తుందని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ తొలి మ్యాచ్ లోనే లక్నో ఓడిపోయింది. కానీ నిన్న హైదరాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ గ్రాండ్ విక్టరీ కొట్టి, అందరికీ షాక్ ఇచ్చింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో అదరగొట్టిన లక్నో, మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ తరుణంలో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాదు తిరుమల వెంకటేశ్వర స్వామి కారణంగానే లక్నో విజయం సాధించిందని వెల్లడించారు.

ఈ క్రమంలోనే లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ప్రతి మ్యాచ్ లో స్పెషల్ గ్యాలరీలో కూర్చునే సంజీవ్ గోయెంకా, తిరుమల వెంకటేశ్వర స్వామి ఫోటోను ఆరదిస్తూ ఉంటాడు. మ్యాచ్ గెలవాలని తన జేబులోనే వెంకటేశ్వర స్వామి ఫోటోను పెట్టుకుంటాడు. ప్రత్యర్థి వికెట్ పడినా, లేదా లక్నో బ్యాటర్లు ఇరగదీసినా వెంటనే ఆ ఫోటో తీసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరాధించే తిరుమల వెంకటేశ్వర స్వామి వీడియో కూడా వైరల్ గా మారింది.

తిరుమల వెంకటేశ్వర స్వామికి సంజీవ్ గోయెంకా ఇచ్చిన విరాళాలు ఇవే

Advertisement

లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా తిరుమల శ్రీవారికి నిత్యం విరాళాలు ఇస్తూ ఉంటారు. 2025 మేలో రూ. 3.63 కోట్ల బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చారు సంజీవ్. అంటే 5.267 కిలోల బంగారం ఇచ్చారన్నమాట. ఇందులో బంగారు కటి, వరద హస్తాలు ఉన్నాయి. ఇటీవల మరోసారి రెండు కోట్ల రూపాయల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read:  Tanveer Ahmed On MI: ఇంకా ఎన్ని అవ‌మానాలు భ‌రిస్తావ్..ముంబైని వ‌దిలి PSLలోకి వ‌చ్చేసేయ్‌.. రోహిత్ శ‌ర్మ‌పై త‌న్వీర్ సంచ‌ల‌నం

 

Related News

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

Big Stories

Advertisement
×