E-Paper
Advertisement

Sanjiv Goenka: సంజీవ్ గోయెంకా విజ‌యం వెనుక రహస్య శక్తి…ఈ ఫోటో సీక్రెట్ ఇదే

Sanjiv Goenka: సంజీవ్ గోయెంకా విజ‌యం వెనుక రహస్య శక్తి…ఈ ఫోటో సీక్రెట్ ఇదే
Advertisement

Sanjiv Goenka:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. మొదటి మ్యాచ్ ఓడిపోయిన లక్నో, ఉప్పల్ వేదికగా హైదరాబాద్ ను చిత్తు చేసింది. హైద‌రాబాద్ పై 5 వికెట్ల తేడాతో విక్ట‌రీ అందుకుంది. ఈ తరుణంలో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా చేసుకున్న సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి. మ్యాచ్ గెలిచిన తర్వాత కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు సంజీవ్ గోయెంకా. అయితే ఆయన విజయం వెనక తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్నట్లు వీడియో వైరల్ గా మారింది. స్వయంగా ఈ విషయాన్ని సంజీవ్ గోయెంకా పేర్కొన్నట్లు వీడియో బయటకు వచ్చింది. ఆ వెంకటేశ్వర స్వామి కారణంగానే హైదరాబాద్ పై లక్నో గెలిచిందని ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read: Shardul Thakur overthrow: శార్దూల్ ఠాకూర్ ఓవర్‌త్రో వివాదం..4 ప‌రుగులు కూడా వ‌ద‌ల‌లేదు, ముంబై, ఢిల్లీ మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం !

లక్నో సూపర్ జెయింట్స్ విజయం వెనక వెంకటేశ్వర స్వామి

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో లక్నో సూప‌ర్ జెయింట్స్‌ విజయాల బాట పట్టింది. గత సీజన్ లో తేలిపోయిన లక్నో, ఈ సారి ఇరగదీస్తుందని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ తొలి మ్యాచ్ లోనే లక్నో ఓడిపోయింది. కానీ నిన్న హైదరాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ గ్రాండ్ విక్టరీ కొట్టి, అందరికీ షాక్ ఇచ్చింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో అదరగొట్టిన లక్నో, మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ తరుణంలో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాదు తిరుమల వెంకటేశ్వర స్వామి కారణంగానే లక్నో విజయం సాధించిందని వెల్లడించారు.

ఈ క్రమంలోనే లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ప్రతి మ్యాచ్ లో స్పెషల్ గ్యాలరీలో కూర్చునే సంజీవ్ గోయెంకా, తిరుమల వెంకటేశ్వర స్వామి ఫోటోను ఆరదిస్తూ ఉంటాడు. మ్యాచ్ గెలవాలని తన జేబులోనే వెంకటేశ్వర స్వామి ఫోటోను పెట్టుకుంటాడు. ప్రత్యర్థి వికెట్ పడినా, లేదా లక్నో బ్యాటర్లు ఇరగదీసినా వెంటనే ఆ ఫోటో తీసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరాధించే తిరుమల వెంకటేశ్వర స్వామి వీడియో కూడా వైరల్ గా మారింది.

తిరుమల వెంకటేశ్వర స్వామికి సంజీవ్ గోయెంకా ఇచ్చిన విరాళాలు ఇవే

Advertisement

లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా తిరుమల శ్రీవారికి నిత్యం విరాళాలు ఇస్తూ ఉంటారు. 2025 మేలో రూ. 3.63 కోట్ల బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చారు సంజీవ్. అంటే 5.267 కిలోల బంగారం ఇచ్చారన్నమాట. ఇందులో బంగారు కటి, వరద హస్తాలు ఉన్నాయి. ఇటీవల మరోసారి రెండు కోట్ల రూపాయల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read:  Tanveer Ahmed On MI: ఇంకా ఎన్ని అవ‌మానాలు భ‌రిస్తావ్..ముంబైని వ‌దిలి PSLలోకి వ‌చ్చేసేయ్‌.. రోహిత్ శ‌ర్మ‌పై త‌న్వీర్ సంచ‌ల‌నం

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×