కోల్ కతా ఫ్రాంచైజీ ఓనర్ అయిన షారూఖ్ ఖాన్ మ్యాచ్ చూసేందుకు ఈడెన్ గార్డెన్స్ కి వచ్చాడు. చివరికి తమ జట్టు ఆఖరి ఓవర్ వరకు పోరాడి ఓడిపోయింది. అయినా సరే, ఆ బాధను మనసులోనే పెట్టుకుని, ప్రత్యర్థి జట్టు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ బట్లర్ ను అభినందించడం నెట్టింట వైరల్ గా మారింది.
చివరి వరకు జరిగిన మ్యాచ్ లో జోస్ బట్లర్ ఆఖరి బంతి వరకు ఆడి మ్యాచ్ ని గెలిపించిన తీరుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. నిజానికి జోస్ బట్లర్ ఆటతీరుకి బాద్ షా షారూఖ్ కూడా ఫిదా అయిపోయాడు. మ్యాచ్ అనంతరం ప్లేయర్లు అందరూ జోస్ ని అభినందిస్తుంటే షారూఖ్ కూడా ప్రత్యేకంగా గ్రౌండ్ వద్దకు వెళ్లి అభినందించాడు. అంతేకాదు ఆత్మీయంగా ఒక హగ్ కూడా ఇచ్చాడు. ఇదిప్పుడు హాట్ ఆఫ్ ది మ్యాచ్ గా మారిపోయింది.
Also Read: అబ్బో.. సునీల్ నరైన్ వెంట ఎన్ని రికార్డులో..
నిజానికి జోస్ బట్లర్ ఆడిన ఆటకి ఒక్క షారూఖ్ మాత్రమే కాదు యావత్ భారతదేశంలోని క్రికెట్ అభిమానులు అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పుడు భారత్ లో జోస్ బట్లర్ ఒక హీరో గా మారిపోయాడు.
విదేశీ ఆటగాళ్లు ఇండియాలో పేరు తెచ్చుకోవడం అరుదుగా ఉంటుంది. వీరిలో ముఖ్యంగా క్రిస్ గేల్, మ్యాక్స్ వెల్, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ ఉంటే, వీరి సరసన ఇప్పుడు జోస్ బట్లర్ కూడా చేరాడని అందరూ కొనియాడుతున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.