BigTV English
Advertisement

SHREYAS IYER: గాయంపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్.. క‌న్నీళ్లు పెట్టుకోవాల్సిందే

SHREYAS IYER: గాయంపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్.. క‌న్నీళ్లు పెట్టుకోవాల్సిందే

SHREYAS IYER: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ వన్డేలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో అయ్యర్ కి సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మూడవ వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఓ అద్భుతమైన క్యాచ్ అందుకునే ప్రయత్నంలో శ్రేయస్ అయ్యర్ పక్కటెముకల ప్రాంతంలో బలంగా దెబ్బ తగిలింది.


Also Read: Glenn Phillips: ప్రియురాలితో ఫీట్లు.. ఈ క్రికెటర్ మామూలోడు కాదురో

దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. మొదట శ్రేయస్ అయ్యర్ సాధారణ గాయంగా భావించాడు. కానీ ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందిగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే స్కానింగ్ లో ప్లీహానికి తీవ్రమైన గాయం అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం అతడిని ఐసియు కి తరలించారు.


గాయంపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్:

గాయంతో ప్రస్తుతం సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రేయస్ అయ్యర్ తన ఆరోగ్యం పై తొలిసారి స్పందించాడు. ” నేను ప్రస్తుతం రికవరీ ప్రక్రియలో ఉన్నాను. నాకు అండగా నిలిచిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. ఇది నిజంగా నాకు చాలా విలువైనది. మీ అందరి ప్రేమ, మద్దతు నాకు చాలా విలువైంది. నన్ను మీ ప్రార్ధనలలో గుర్తుంచుకున్నందుకు ధన్యవాదాలు.” అంటూ గురువారం రోజు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ చేసిన ఈ పోస్ట్ తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

అయ్యర్ గాయం పై బీసీసీఐ క్లారిటీ :

శ్రేయస్ అయ్యర్ గాయంపై బీసీసీఐ కూడా ఈ నెల 27, 28 తేదీలలో ప్రకటనలు విడుదల చేసింది. ” మూడవ వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో శ్రేయస్ అయ్యర్ కడుపు భాగంలో బలమైన దెబ్బ తగలడంతో ప్లీహమ్ దెబ్బతింది. దీంతో అంతర్గత రక్తస్రావం జరిగింది. గాయాన్ని గుర్తించి వెంటనే రక్త స్రావాన్ని అరికట్టడం జరిగింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం మెరుగుపడినట్లు తేలింది. సిడ్ని, భారత నిపుణుల పర్యవేక్షణలో శ్రేయస్ అయ్యర్ కోలుకుంటున్నాడు” అని వివరించింది.

Also Read: Arshdeep Singh: తొలి టీ-20లో అర్షదీప్ ను త‌ప్పించ‌డంపై ట్రోలింగ్‌.. హ‌ర్షిత్ రాణా పెద్ద తోపా అంటూ !

ఇక తాజాగా అయ్యర్ కూడా తన ఆరోగ్యం పై స్పష్టత ఇవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్లీహానికి జరిగిన గాయం పూర్తిగా మానాలంటే 6 నుంచి 12 వారాల సమయం పడుతుంది. ఈ సమయంలో గాయానికి గురైన వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రికవరీ సమయంలో మరొకసారి ప్లీహానికి గాయమైతే మళ్లీ అంతర్గత రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ మళ్ళీ బ్యాట్ పట్టాలంటే దాదాపు 3 నెలల వరకు ఆగాల్సిందే. కానీ ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ శారీరకంగా ఫిట్ గా ఉన్నాడు కాబట్టి.. మరి కాస్త తక్కువ సమయంలోనే రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక అతడు త్వరగా కోలుకొని.. మళ్లీ మైదానంలో అడుగు పెట్టాలని అటు టీమిండియా ఆటగాళ్లు, ఇటు బిసిసిఐ, అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Kuldeep yadav: న‌ర్సుతో ఎ**ఫైర్ పెట్టుకున్న కుల్దీప్ యాద‌వ్.. ఏకంగా బెడ్ పైనే ?

KL Rahul: ఐపీఎల్ 2026 కంటే ముందే కేఎల్ రాహుల్ కు రూ.25 కోట్ల ఆఫ‌ర్ ?

Australia Cricketer Dies: ఆస్ట్రేలియాలో మ‌రో పెను విషాదం..బంతి తగిలి క్రికెటర్ మృతి

Yuzvendra Chahal: హీరో నాని లవ్ ఫెయిల్యూర్ పాట‌కు యుజ్వేంద్ర చాహల్ చిందులు

IND VS AUS: ఇవాళ్టి సెమీస్ కు వ‌ర్షం గండం..మ్యాచ్ ర‌ద్దు అయితే ఫైన‌ల్ కు వెళ్లేది ఎవ‌రంటే

Pro Kabaddi League 2025: భ‌ర‌త్ ఒంటరి పోరాటం వృధా, ఇంటిదారి పట్టిన తెలుగు టైటాన్స్.. ఎల్లుండి ఫైనల్, ఆ రెండు జట్ల మధ్య ఫైట్

ENGW vs RSAW: చ‌రిత్ర‌లోనే తొలిసారి, వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ దూసుకెళ్లిన ద‌క్షిణాఫ్రికా..మ‌గాళ్ల‌కు కూడా సాధ్యం కాలేదు !

Big Stories

×