BigTV English
Advertisement

IND vs NZ: బెంగళూరు టెస్ట్‌కు వర్షం అంతరాయం..ఇంకా ప్రారంభం కానీ మ్యాచ్ !

IND vs NZ: బెంగళూరు టెస్ట్‌కు వర్షం అంతరాయం..ఇంకా ప్రారంభం కానీ మ్యాచ్ !

Team India Vs New Zealand: టీమిండియా ( Team India) వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand ) మ్యాచ్ కు మళ్ళీ వర్షం అడ్డంకిగా మారింది. ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ 9:30 దాటినా కూడా.. మొదటి టెస్ట్ ప్రారంభం కాలేదు. ఇవాళ ఉదయం బెంగళూరులో ( BEnguluru) వర్షం భారీగానే పడింది. దీంతో గ్రౌండ్ ఎంత… కవర్స్ తో కప్పేశారు. 9:45 కు కవర్స్ తొలగించి… మ్యాచ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


Start delayed due to wet outfield New Zealand need 107

ప్రస్తుతమైతే చిన్నస్వామి స్టేడియంలో ( Chinna swamy stadium) తొలకరి జల్లులు పడుతున్నాయి. మరో పది నిమిషాల్లో వర్షం ( Rain) తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే… మ్యాచ్ 10 గంటల తర్వాత ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ ( New Zealand ) వర్సెస్ టీమ్ ఇండియా ( Team India) మధ్య మ్యాచ్ కు ఇవాళ చివరి రోజు.

Also Read: ICC Womens T20 World Cup: నేడు మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్.. దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ ఫైట్‌..


ఈ ఐదవ రోజున…. న్యూజిలాండ్ గెలవాలంటే 107 పరుగులు చేయాల్సి ఉంది. అటు టీమిండియా గెలవాలంటే.. న్యూజిలాండ్ ను ఆల్ అవుట్ చేయాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో… వర్షం ఇవాళ మొత్తం అడ్డంకిగా మారితే.. టెస్టు డ్రాగా ముగిసే ఛాన్స్ ఉంది. ఇది ఇలా ఉండగా… టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకు ఆల్ అవుట్ అయిన సంగతి తెలిసిందే. భారీ వర్షం కారణంగా… బెంగళూరు చిన్న స్వామి పిచ్ ( Chinna swamy stadium) ఎవరికి అర్థం కాలేదు.

Also Read: Rishabh Pant: ఏడోసారి 90లో ఔట్… రిషబ్ పంత్‌ కు ఆరేళ్లుగా ఇదే తంతూ!

దీంతో టీమిండియా వికెట్లు టపటపా రాలిపోయాయి. అయితే అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్… 402 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఈ తరుణంలోనే… టీమిండియా కు ( Team India) ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.ఇక అనంతరం… రెండో ఇనింగ్స్ ప్రారంభించిన టీమిండియా 462 పరుగులు చేయగలిగింది. మరో 50 నుంచి 100 పరుగులు చేసి ఉంటే టీమిండియా పరిస్థితి వేరేలా ఉండేదని చెబుతున్నారు.ఇప్పుడు వారి నుండి పై ఆశలు పెట్టుకుంది టీమిండియా.

 

కాగా మొదటి ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలమైన టీమిండియా ఆటగాళ్లు.. రెండో ఇన్నింగ్స్ లో దుమ్ము లేపిన సంగతి తెలిసిందే. సర్ఫ రాజ్ ఖాన్ రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 150 పరుగులు చేశాడు. అటు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 99 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.  దీంతో.. సెంచరీ మిస్ చేసుకున్నాడు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఇలా 90 పరుగులు చేసిన తర్వాత ఔట్ కావడం టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు కొత్తే మీ కాదు.. ఇప్పటికే..  6 సార్లు ఇలా అవుట్ అయ్యాడు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్.

Related News

Cricket players : ఇప్ప‌టి క్రికెట‌ర్లు ఆ వైట్ క్రీమ్ ను ఎందుకు వాడ‌టం లేదో తెలుసా..?

IPL 2026-SSMB 29 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు చిచ్చులు పెడుతున్న మహేష్-జక్కన్న, వేలం ఎప్పుడంటే?

Hong Kong Sixes 2025 Final: హాంకాంగ్‌ సిక్సెస్ 2025 విజేత‌గా పాకిస్తాన్..6వ సారి ట్రోఫీ, ప్రైజ్ మ‌నీ ఎంతంటే

IPL 2026: సంజు ఎఫెక్ట్‌..జ‌డేజా అకౌంట్ పై బ్యాక్‌, ఐపీఎల్ 2026కు ముందే సంచ‌ల‌నం !

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ లెస్బియన్ అంటూ ట్రోలింగ్..ఆ ఫోటోలు వైర‌ల్ ?

Jemimah Rodrigues: టార్చ‌ర్ భ‌రించ‌లేక‌ మ‌రోసారి మ‌తం మార్చేసిన జెమిమా ?

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Big Stories

×