SRH : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కంటే ముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Sunrisers Hyderabad) వివాదంలో చిక్కుకుంది. ఏ మాత్రం ప్రయోజనం లేని, పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( abrar ahmed) ఏరి కోరి కావ్య పాప కొనుగోలు చేశారు. దీంతో కావ్య పై దారుణంగా పోస్టులు పెడుతున్నారు క్రికెట్ అభిమానులు. ఇండియాలో డబ్బులు సంపాదించి పాకిస్తానోడికి పెట్టడం ఏంటి ? అంటూ కావ్య పాప పై దేశ ద్రోహి ముద్ర వేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కావ్య పాపకు మరో ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను వదిలేస్తేనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తామని ఇషాన్ కిషన్ ( ishan kishan ), అభిషేక్ శర్మ ( abhishek sharma) లాంటి ప్లేయర్లు కండిషన్ పెట్టినట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది. దీంతో కావ్య పాపకు కొత్త చిక్కులు వచ్చాయని చర్చ జరుగుతోంది.
ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వేళలో 2.34 కోట్లకు కావ్య పాప కొనుగోలు చేశారు. వేలంలోకి పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ రావడంతో ఎగబడి మరి కొనుగోలు చేశారు కావ్య పాప. ది హండ్రెడ్ లీగ్ లో సన్రైజర్స్ లీడ్స్ జట్టును నడిపిస్తున్నారు కావ్య పాప. అయితే పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసిన నేపథ్యంలో తీవ్రస్థాయిలో కావ్య పాప విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన స్టార్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కూడా తిరుగుబాటు చేసినట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను సన్రైజర్స్ గ్రూప్ నుంచి వదిలేస్తేనే తాము ఆడతామని ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కండిషన్ పెట్టినట్లు కథనాలు వస్తున్నాయి. లేకపోతే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున వచ్చే సీజన్ లో ఆడబోమని వెల్లడించారని అంటున్నారు. ఇదే బాటలో మరికొంతమంది ఇండియన్ ప్లేయర్లు నడిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. కానీ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న హెడ్ లాంటి విదేశీ ప్లేయర్లు మాత్రం గప్ చుప్ అయ్యారట. కేవలం ఇండియన్ ప్లేయర్లు మాత్రమే తిరుగుబాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కావ్య పాప తల పట్టుకున్నట్లు సమాచారం.
ది హండ్రెడ్ లీగ్ లో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసినందుకు కావ్య పాపను అందరూ తిడుతుంటే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం క్లీన్ చిట్ ఇచ్చింది. విదేశీ లీగ్స్ లో పాకిస్తాన్ ప్లేయర్లను కొనుగోలు చేస్తే తామేమి చేయలేమని చేతులు దులుపుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో మాత్రం పాకిస్తాన్ ప్లేయర్లపై ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేసింది బీసీసీఐ.
https://www.facebook.com/photo/?fbid=956766793984538&set=a.101057992888760