World Cup 2027: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )
ఇటీవల గెలుచుకుంది టీమిండియా ( Team India). దీంతో ముచ్చటగా మూడవసారి టి20 వరల్డ్ కప్ గెలుచుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో టి20 వరల్డ్ కప్ అందుకున్న టీమిండియా, ఇక ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ 2027 పై ( World Cup 2027 ) కన్నేసింది. మరో ఏడాది కాలంలోనే వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే ఆ దిశగా టీమిండియా యాజమాన్యం అడుగులు వేస్తోంది. దీనికి తగ్గట్టుగానే టీమిండియా సెలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంటులో రోహిత్ శర్మ ( Rohit Sharma) అలాగే విరాట్ కోహ్లీ ( Virat Kohli) ఇద్దరు ఓపెనర్లుగా దిగాలని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) సంచలన వ్యాఖ్యలు చేశారు.
వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ ( World Cup 2027 ) మరికొన్ని నెలలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటినుంచే సన్నద్ధమవుతోంది టీమిండియా. ఇందులో భాగంగానే బుమ్రాకు టి20లో అవకాశం ఇవ్వకుండా ఇకపై వన్డేలు మాత్రమే ఆడించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ ఆడే తన డ్రీమ్ ప్లేయింగ్ 11 జట్టును ప్రకటించాడు రవిచంద్రన్ అశ్విన్. అయితే రవిచంద్రన్ ప్రకటించిన ఈ జట్టులో వన్డే కెప్టెన్ గిల్ కు అవకాశమే లేదు. అతన్ని కెప్టెన్ గా తొలగించాలని.. అసలు వరల్డ్ కప్ ఆడించకూడదని రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించారు. అతని స్థానంలో రిషబ్ పంత్ కు కెప్టెన్సీ ఇవ్వాలని రవిచంద్ర అశ్విన్ డిమాండ్ చేశారు.
అంతేకాదు వరల్డ్ కప్ సమయంలో ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బరిలో దిగితే సూపర్ ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఇక మూడో, నాలుగో వికెట్ కు రుతురాజు గైక్వాడ్ అలాగే శ్రేయాస్ అయ్యర్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. మిడిల్ ఆర్డర్ లో తిలక్ వర్మ, పంత్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని తెలిపాడు. హార్దిక్ పాండ్యాను కూడా వన్డే వరల్డ్ కప్ లో ఆడించాలని స్పష్టం చేశాడు అశ్విన్. ఇక రవీంద్ర జడే స్థానంలో అక్షర్ పటేల్ ను తీసుకోవాలని స్పష్టం చేశాడు. ప్రధాన స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కు అవకాశం ఇవ్వాలని అశ్విన్ తన డ్రీమ్ 11 జట్టును ప్రకటించాడు. అటు ఫాస్ట్ బౌలర్ గా బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణకు చోటు కల్పించారు.
వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంటు వచ్చే ఏడాది దసరా సమయంలో ఉండే ఛాన్స్ ఉంది. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే అలాగే నమీబియా వేదికగా ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. మొత్తం 44 మ్యాచులు జరుగుతాయి. ఈ టోర్నమెంట్లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య కూడా మరోసారి మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Shubman Gill On Sanju: ఛీ..ఛీ ఇదేం బతుకురా, సంజుపై గిల్ కుట్రలు..ఫోటో మార్ఫింగ్ చేసి మరీ!
🚨 BIG STATEMENT BY RAVI ASHWIN ON VIRAT KOHLI AND ROHIT SHARMA 🚨
Ashwin said – “If Rohit Sharma and Virat Kohli open in the 2027 World Cup, then Ruturaj Gaikwad and Shreyas Iyer can bat at No.3 and 4.”
But, What about Shubman Gill, What's your take 🤔pic.twitter.com/MTcqUaT0fA
— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 15, 2026