E-Paper
Advertisement

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌
Advertisement

Abhishek Sharma: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( Asia cup 2025) భాగంగా ఇవాళ సూపర్ ఫోర్ బీకర ఫైట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఇందులో టాస్ ఓడిపోయిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేస్తోంది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదట .. ప్రారంభం అదరగొట్టింది. కానీ అభిషేక్ శర్మతో పాటు గిల్ అవుట్ కావడంతో కష్టాల్లో పడింది టీం ఇండియా. ఇప్పటికే ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా పోరాడుతోంది.

Also Read: Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

అభిషేక్ శర్మ కొంపముంచిన సూర్య కుమార్ యాదవ్

Advertisement

టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న సూపర్ ఫోర్ మ్యాచ్లో మరోసారి అభిషేక్ శర్మ ( Abhishek sharma) మెరిశాడు. 37 బంతుల్లోనే 75 పరుగులు చేసిన అభిషేక్ శర్మ…. రఫ్ ఆడించాడు. ఇందులో ఐదు సిక్సర్లు అలాగే ఆర్ బౌండరీలు ఉన్నాయి. 22 స్ట్రైక్ రేటుతో… బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు అభిషేక్ శర్మ. అయితే అభిషేక్ శర్మ మంచి ఊపులో ఉన్న సమయంలో అతని మొత్తం డిస్టబ్ చేశాడు సూర్య కుమార్ యాదవ్. సూర్య కుమార్ యాదవ్ అనవసరమైన షాట్ కారణంగా… అభిషేక్ శర్మ రనౌట్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో… ఫ్రంట్ ఫీల్డర్ కు బంతిని బాదాడు. అయితే… అక్కడే ఉన్న హుస్సేన్ బంతిని వెంటనే ముస్తాఫిజుర్ రహమాన్ కు వేశాడు. అయితే బయట ఉన్న అభిషేక్ శర్మ… క్రీజులోకి చేరేలోపు… ముస్తాఫిజుర్ రహమాన్ వికెట్లను బాదేశాడు. దీంతో అభిషేక్ శర్మ 75 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోని టీమిండియా కష్టాల్లో పడింది. టీమిండియా ప్ర‌స్తుతం స్కోర్ 5 వికెట్లు న‌ష్టపోయి 160 కి పరుగులు చేసింది. 17 ఓవ‌ర్లు ఫినీష్ అయ్యాయి.

సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డం పై ట్రోలింగ్‌

టీమిండియా వ‌ర్సెస్ బంగ్లా దేశ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన ఈ మ్యాచ్ లో సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే టీమిండియా 5 వికెట్లు న‌ష్ట‌పోయింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు సంజూ శాంస‌న్ కు బ్యాటింగ్ కు దించ‌లేదు. అక్ష‌ర్ ప‌టేల్ లాంటి ప్లేయ‌ర్ ను బ‌రిలోకి దించారు కానీ… సంజూ శాంస‌న్ ఇంకా బ్యాటింగ్ కు దించ‌లేదు. దీనిపై ఫ్యాన్స్ ఆగ్ర‌హిస్తున్నారు. మొన్న‌టి మ్యాచ్ లో కూడా సూర్య కుమార్ యాద‌వ్ బ్యాటింగ్ చేయ‌లేదు. దీంతో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు ఇప్ప‌టికే టీమిండియా 5 వికెట్లు న‌ష్ట‌పోయింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు సంజూ శాంస‌న్ కు బ్యాటింగ్ కు దించ‌లేదు. అత‌న్ని దించితే స్కోర్ పెరిగేద‌ని అంటున్నారు అభిమానులు. క‌నీసం 200కు పైగా టీమిండియా స్కోర్ చేసేంద‌ని భావిస్తున్నారు. సూర్య కుమార్ యాద‌వ్ త‌ప్పు చేశార‌ని అంటున్నారు.

Advertisement

Also Read: IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×