Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 20026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పై విషం కక్కుతున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. ఇందులో తన్వీర్ అహ్మద్ కూడా ఉన్నాడు. ఐపీఎల్ టోర్నమెంట్ లో ఫిక్సింగ్ జరుగుతోందని పదే పదే ఆరోపణలు చేస్తున్నాడు. అయితే అలాంటి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ కు ( Tanveer Ahmed) మోడీ ప్రభుత్వం ( Modi Govt) ఊహించని షాక్ ఇచ్చింది. ఇండియాలో ( India) పర్యటించేందుకు వీసా అప్లై చేసుకుంటే, రిజెక్ట్ చేసిందట మోడీ సర్కార్. ఈ విషయాన్ని స్వయంగా తన్వీర్ అహ్మద్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.
Also Read: Inzamam-ul-Haq: Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శతకం చేస్తే, బాబర్ మాత్రం సెంచరీ చేస్తాడు
ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఏ మాత్రం బాగాలేవన్న సంగతి తెలిసిందే. పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు ఉన్నాయి. పహాల్గమ్ సంఘటన తర్వాత పాకిస్తాన్ వాళ్లకు ఇండియాలో ఎంట్రీ లేకుండా చేస్తుంది సర్కార్. బోర్డర్ లో అలాగే వీసా విషయంలో చాలా కఠినంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోంది. అయితే ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మాజీ బౌలర్ తన్వీర్ అహ్మద్ కు ఊహించని షాక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం. ఇండియాలో పర్యటించేందుకు తాజాగా తన్వీర్ అహ్మద్ వీసా కోసం అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం మొత్తం 50 వేల రూపాయలు ఖర్చు పెట్టాడట.
అయితే 50,000 ఖర్చు అయిన కూడా వీసా రిజెక్ట్ చేసినట్లు ఇండియన్ ఎంబసీ వెల్లడించినట్లు స్పష్టం చేశాడు తన్వీర్ అహ్మద్. అసలు ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయం చెప్పకుండానే తనకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు తన్వీర్ అహ్మద్. తాను మూడు నెలలుగా సంపాదించిన డబ్బులు అన్ని ఈ వీసా కోసం పెడితే గంగపాలు చేశారని మోడీ సర్కార్ పై మండిపడ్డారు. ఇండియాకు వెళ్దాం అనుకున్నా తన కల నెరవేరకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం వేపుతున్నాయి.
పహల్గామ్ సంఘటనపై ఇటీవల పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ సంఘటనలో 26 మందిని చంపుతున్న కూడా ఇండియన్ ఆర్మీ ఎక్కడ ఉందని నిలదీశారు. ఆ ప్రాంతంలో ఎనిమిది లక్షల మంది ఇండియన్ ఆర్మీ ఉన్నప్పటికీ… ఘటన పూర్తయ్యే వరకు అక్కడికి చేరుకోలేదని ఆగ్రహించారు. మోడీ సర్కార్ కు అనుకూలంగా ఆ ఘటనను మార్చుకునేందుకు ఈ కుట్రలు చేశారని ఫైర్ అయ్యారు.
https://www.facebook.com/photo/?fbid=986533964287346&set=a.808612632079481