E-Paper
Advertisement

Tanveer Ahmed: ఐపీఎల్ లోకి పాక్ ప్లేయ‌ర్ల‌ను తీసుకోవాల్సిందే..లేక‌పోతే ఐసీసీ బ్యాన్ వేయాలి

Tanveer Ahmed: ఐపీఎల్ లోకి పాక్ ప్లేయ‌ర్ల‌ను తీసుకోవాల్సిందే..లేక‌పోతే ఐసీసీ బ్యాన్ వేయాలి
Advertisement

Tanveer Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) అతి త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 28వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ షురూ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాడు తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోకి పాకిస్తాన్ ప్లేయర్లను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ పాకిస్తాన్ ప్లేయర్లను తీసుకోకపోతే, ఐపీఎల్ టోర్నమెంట్ పైన ఐసీసీ బ్యాన్ ( ICC Ban) విధించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలపై అటు ఇండియన్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇస్తున్నారు. మీలాంటి దుర్మార్గులకు ఇండియాలో ఛాన్స్ లేదని స్పష్టం చేస్తున్నారు.

Also Read: RCB VS SRH: కావ్యా పాపపై దారుణంగా పోస్టులు..స‌న్ రైజ‌ర్స్ ను పాకిస్తాన్ గా ఫోటోలు మార్ఫింగ్ చేసి

ఐపీఎల్ లోకి పాక్ ప్లేయ‌ర్ల‌ను తీసుకోవాల్సిందే

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో కచ్చితంగా పాకిస్తాన్ ప్లేయర్లు ఉండాలని.. అప్పుడే టోర్నమెంట్ మజా వస్తుందని వెల్లడించారు. పాకిస్తాన్ ప్లేయర్లు లేకపోతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చూడలేకపోతున్నామని ఈ వ్యాఖ్యానించారు. కచ్చితంగా దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి దృష్టి పెట్టాలని కోరారు. బాబర్ ఆజం, షాహీన్ ఆఫ్రిది లాంటి ప్లేయర్లకు ఇండియాలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారని గుర్తు చేశారు. బాబర్ లాంటి ప్లేయర్లు ఐపీఎల్ ఆడాలని కోరుతున్నారని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఇండియాలో కూడా పాకిస్తాన్ ప్లేయర్లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోకి పాకిస్తాన్ ప్లేయర్లను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ పాకిస్తాన్ ప్లేయర్లను తీసుకోకపోతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పైన ఐసిసి బ్యాన్ విధించాలని విషం కక్కారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

2008 నుంచి పాకిస్తాన్ ప్లేయర్స్ పై బ్యాన్

ఐపీఎల్ టోర్నమెంట్లో మొదట్లో పాకిస్తాన్ ప్లేయర్లు ఆడేవాళ్లు. కానీ 2008లో ముంబైలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. దీంతో ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య బంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడకుండా ఆదేశాలు ఇచ్చింది బీసీసీఐ. అప్పటినుంచి ఐపిఎల్ ఒకటే కాదు ద్వైపాక్షిక సిరీస్ లు కూడా రద్దయ్యాయి. కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక అటు తాజాగా పాక్ ప్లేయ‌ర్ అబ్రార్ అహ్మ‌ద్ ను కావ్య పాప కొనుగోలు చేసి, వివాదానికి తెర‌లేపారు.

Advertisement

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×