Tanveer Ahmed: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం ఇండియా పై విషం కక్కుతున్నారు. ఇండియా గెలవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని చెప్తున్నారు. అయితే సంజు శాంసన్ కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు వచ్చిన నేపథ్యంలో తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్యాట్ లో చిప్ లు ఆడిన సంజుకు ( Sanu Samson) ఇలా మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇస్తారని నిలదీశారు తన్వీర్ అహ్మద్. దీనికి అసలు సిసలు అర్హుడు ఫర్హాన్ ( Sahibzada Farhan ) అంటూ వ్యాఖ్యానించాడు.
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) విజేతగా టీమిండియా నిలిచింది. అయితే ఈ టోర్నమెంటులో కేవలం ఐదు మ్యాచ్ లలోనే ఆడిన సంజు శాంసన్, 321 పరుగులు సాధించాడు. ఈ సందర్భంగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సంజు శాంసన్ కు ఇచ్చింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిలింగ్. అయితే దీనిపై పాకిస్తాన్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తమ ఓపెనర్ ఫర్హాన్ 383 పరుగులు చేస్తే ఆ అవార్డు ఎందుకు దక్కలేదని నిలదీస్తున్నారు. ఇదే అంశంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) స్పందించాడు. బ్యాట్ లో చిప్ లు ఆడి సంజు శాంసన్ ఐసీసీని మోసం చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. లేకపోతే చివరి క్షణంలో ఫామ్ లోకి వచ్చి సంజు శాంసన్ ఎలా ఆడతాడని నిలదీశారు. అయినా సంజు శాంసన్ కంటే ఎక్కువగా పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ పరుగులు చేశాడని గుర్తు చేశారు. న్యాయం ప్రకారం ఫర్హాన్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రావాలని స్పష్టం చేశారు. దీనిపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు తన్వీర్ అహ్మద్.
మూడు సంవత్సరాలలో ఐసీసీ ( ICC) టోర్నమెంట్ లను మూడింటిని గెలుచుకుంది టీమిండియా ( Team India). అయితే దీనిపై కూడా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు మూడేళ్లలో మూడు టైటిల్స్ ను ఏ జట్టు కూడా గెలుచుకోలేదని ఫైరయ్యారు. ఇదంతా ఐసీసీ బాస్ జై షా (ICC Boss JAy Shah) కుట్రలే అంటూ ఆరోపణలు చేశారు. అతను లేకపోతే టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవదని షాకింగ్ కామెంట్స్ చేశారు తన్వీర్ అహ్మద్.
?utm_source=ig_web_copy_link
🚨 TANVEER AHMED MASSIVE STATEMENT ON INDIA 🚨
🗣️ How can Team India win 3 World Cups in 3 years? This can never happen. Indian team has now started being dishonest. ICC Chairman President Jay Shah is supporting them, that is why these people are winning trophies again and… pic.twitter.com/LYACNB1vCZ
— Cricket Paradox (@Cricket_Paradox) March 9, 2026