E-Paper
Advertisement

TG20 లీగ్ లో ‘బాసింగ బలాలు’ సాంగ్…మ‌ళ్లీ ట్రోలింగ్ షురూ !

TG20 లీగ్ లో ‘బాసింగ బలాలు’ సాంగ్…మ‌ళ్లీ ట్రోలింగ్ షురూ !
Advertisement

Telangana Folk Songs in TG20:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఒక పక్క టి20 సిరీస్ జరుగుతుంటే.. తెలంగాణలో మాత్రం టీజీ 20 లీగ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. గత నెలలో ప్రారంభమైన ఈ టోర్నమెంట్ లో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Rajiv Gandhi International Cricket Stadium) వేదికగా ఈ టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచులు జరుగుతున్నాయి. గ్రూప్ స్టేజ్ లో మ్యాచులు ఫినిష్ కాగా.. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జానపద పాటలను ఉప్పల్ స్టేడియంలో తాజాగా ప్రదర్శించారు. ప్రముఖ సింగర్లు వచ్చి.. పాటలు పాడారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

Also Read: Shahid Afridi Reaction On England vs India, 2nd T20I : ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓట‌మి.. టీమిండియా ప‌త‌నం మొద‌లైందంటూ అఫ్రిది సంచ‌ల‌నం !

TG20 లీగ్ లో ‘బాసింగ బలాలు’ సాంగ్…మ‌ళ్లీ ట్రోలింగ్ షురూ !

Advertisement

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీనిధి యూనివర్సిటీ టీజీ 20 లీగ్ (Telangana Folk Songs in TG20 ) అద్భుతంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ జరుగుతున్న క్రమంలో గురువారం ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లు జరిగాయి. అయితే కీలక మ్యాచ్ లు జరిగిన నేపథ్యంలో మధుప్రియ, బోలే లాంటివాళ్ళు ఉప్పల్ స్టేడియంలో సందడి చేసి… తెలంగాణ జానపద పాటలను అందుకున్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ‘బాసింగ బలాలు’ అనే పాట కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే అదే పాటను స్టేడియంలో ప్రదర్శించారు. దీంతో స్టేడియానికి వచ్చిన క్రికెట్ అభిమానులు.. ఈ పాటలు ఎంజాయ్ చేశారు. ఏపీ అలాగే తెలంగాణ అనే భేదం లేకుండా తిలకించారు.

ఉప్పల్ స్టేడియం (Rajiv Gandhi International Cricket Stadium) వేదికగా తెలంగాణ జానపద పాటలను ప్రదర్శించగా.. కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అసలు ఆ భాష తమకు అర్థం కావడంలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఒక పదాన్ని అర్థం చేసుకునే లోపు.. మరో స్వరం పాడుతున్నారని హేళన చేశారు. దీంతో మళ్లీ తెలంగాణ ప్రాంతీయ భాష పై ఏపీ నెటిజెన్స్ ట్రోలింగ్ చేయడం ప్రారంభించారని చర్చ మొదలైంది. అయితే ఈ ట్రోలింగ్ పై కొంత మంది ఏపీ వాసులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఒకరిద్దరూ కారణంగా.. ఏపీ,  తెలంగాణ ( Telangana – AP) ప్రజల మధ్య విభేదాలు పెరుగుతున్నాయని మండిపడుతున్నారు. అనవసరంగా రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదని కోరుతున్నారు. ఎప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కటేనని హితువు పలుకుతున్నారు. అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని చెబుతున్నారు.

Advertisement

 Also Read: Joshua Tromp names Haris Rauf as the toughest bowler: హారిస్ రవూఫ్ ఒక్క‌డే ప్ర‌పంచంలోనే భ‌యంక‌ర‌మైన బౌల‌ర్

 

Related News

కోహ్లీ కంటే శ్రేయ‌స్ అయ్య‌రే బెట‌ర్ కెప్టెన్‌..టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

ఇండియా, పాక్ మ‌ధ్య వ‌రుస‌గా మూడు మ్యాచ్ లు..షెడ్యూల్ ఇదే

గంభీర్ ను వెంట‌నే త‌ప్పించండి.. లేక‌పోతే టీమిండియాను ఉగాండా చేస్తాడు!

ఇక‌పై నా ఫోక‌స్ టీమిండియాపైనే..ప్ర‌తీ మ్యాచ్ లోనూ చిత్తుగా ఓడిస్తా

అన‌వ‌స‌రంగా ట్రోల్ చేస్తున్నారు..శ్రేయ‌స్ క‌చ్చితంగా ధోని అంత‌టి కెప్టెన్ అవుతాడు

పేస్ బౌలింగ్ కు భ‌య‌ప‌డి, శివమ్‌ దూబేను డ‌గౌట్ లో దాచిపెడుతున్నారు

అంద‌రూ లెఫ్ట్ హ్యాండర్లే..శివమ్‌ దూబేను ప‌క్క‌కు పెట్టి, సంజును తీసుకోండి

Big Stories

Advertisement
×