Shahid Afridi Reaction On England vs India, 2nd T20I: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టి20 సిరీస్ నేపథ్యంలో మొదటి మ్యాచ్ రద్దు కాగా… రెండు మ్యాచ్ ఇవ్వాళ జరిగింది. ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో పోరాడి టీమిండియా ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది టీమిండియా. టీమిండియా ఓటమిపాలైన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన టీమిండియా పని అయిపోయిందని బాంబు పేల్చారు. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియా పతనం మొదలైందని.. వరుసగా ఆ జట్టు ఓటములను చవిచూడడం గ్యారంటీ అంటూ హేళన చేస్తూ షాహిద్ అఫ్రిది రెచ్చిపోయి స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో భాగంగా శనివారం రోజున టీం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ బిగ్ ఫైట్ జరిగింది. మాంచెస్టర్ వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా 20 ఓవర్లు వాడిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్… 19 ఓవర్లలో మ్యాచ్ ఫినిష్ చేసింది. గతంలో ఇదే వేదికగా దక్షిణాఫ్రికా పైన 300కు పైగా పరుగులు సాధించిన ఇంగ్లాండ్… ఈ మ్యాచ్ లో 19 ఓవర్స్ లో 6 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించి రికార్డు సృష్టించింది. దీంతో టీమిండియా పై 4 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది ఇంగ్లాండ్ టీం. ఈ క్రమంలో టీమిండియా పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఇంగ్లాండ్ చేతిలో రెండో టి20 లో చిత్తుగా ఓడిన టీమిండియా పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా.. ఇంగ్లాండ్ చేతిలో కూడా అదే బాటపడుతుందని హెచ్చరించారు. ఇందులో భాగంగానే రెండో టి20 లో ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ ఒకటే కాదు.. ఇకపై టీమిండియా ఏ మ్యాచ్ లో కూడా గెలవబోదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.