E-Paper
Advertisement

Telugu Titans: ద‌క్షిణాఫ్రికాకు WTC, ఆర్సీబీకి IPL 2025, ఇక నెక్ట్స్ తెలుగు టైటాన్సే లోడింగ్‌

Telugu Titans: ద‌క్షిణాఫ్రికాకు WTC, ఆర్సీబీకి IPL 2025, ఇక నెక్ట్స్ తెలుగు టైటాన్సే లోడింగ్‌
Advertisement

Telugu Titans :  ప్రో కబడ్డీ 2025 టోర్నమెంటులో (Pro Kabaddi League ) తెలుగు టైటాన్స్ అద్భుతంగా రాణిస్తోంది. ప్రో కబడ్డీ లీగ్ 2025 సీజన్ లో క్వాలిఫైయర్ టు స్టేజ్ కు తెలుగు టైటాన్స్ ( Telugu Titans ) చేరుకుంది. వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న తెలుగు టైటాన్స్… టైటిల్ గెలిచేందుకు ఒక్క అడుగు దూరంలోనే ఉంది. ఈ టోర్నమెంట్ లో నిన్న పాట్నా పైరేట్స్ జట్టును ( Patna Pirates) చిత్తు చేసి, క్వాలిఫైయర్ 2 కు దూసుకు వెళ్ళింది తెలుగు టైటాన్స్‌. ఇక ఇవాళ క్వాలిఫైయర్ 2 లో పుణేరి పల్టాన్ (Puneri Paltan) జట్టుతో అమితుమీ తేల్చుకోనుంది తెలుగు టైటాన్స్.

Also Read: Dream Coaching Staff: గంభీర్ తోక కట్ చేసేందుకు రంగంలోకి ఆ ఐదుగురు.. ఇక టీమిండియాను ఆపడం ఎవరి తరం కాదు

Advertisement

ఇందులో ఒకవేళ తెలుగు టైటాన్స్ విజయం సాధిస్తే శుక్రవారం రోజున దబాంగ్ ఢిల్లీ కేసి ( Dabang Delhi K.C. )తో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఫైనల్ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ ఎలాగైనా విజయం సాధిస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరహాలోనే తెలుగు టైటాన్స్ కూడా చాలా సంవత్సరాల తర్వాత టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

18 ఏళ్ల తర్వాత టైటిల్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (Indian Premier League Tournament ) 18 సంవత్సరాలుగా కొనసాగుతోంది. అయితే గడిచిన 17 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎక్కడ టైటిల్ గెలవలేదు. కానీ మొన్న 18వ సీజన్ లో మాత్రం అద్భుతంగా విజయం సాధించి టైటిల్ ఎగురేసుకు వెళ్లింది రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. అలాగే ఫైనల్ దాకా వెళ్లి దక్షిణాఫ్రికా పదే పదే చాలా ఐసీసీ టోర్నమెంట్లలో ఓడిపోయింది. కానీ మొన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో మాత్రం అద్భుతంగా గెలిచి ఛాంపియన్ గా నిలిచింది. దీంతో బెంగళూరు అలాగే దక్షిణాఫ్రికా తరహాలోనే తెలుగు టైటాన్స్ విజయం సాధిస్తుందని అందరూ అభిమానులు అంచన వేస్తున్నారు.

కన్నీళ్లు పెట్టుకున్న తెలుగు టైటాన్స్ కోచ్

Advertisement

ప్రో కబడ్డీ లీగ్ 2025 టోర్నమెంట్ లో తెలుగు టైటాన్స్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు టైటాన్స్ తాజాగా ఎలిమినేటర్ 3 లో పాట్నా పై విజయం సాధించి సెమీ ఫైనల్ కు చేరుకుంది. దీంతో తెలుగు టైటాన్స్ కోచ్ క్రిషన్ కుమార్ హుడా చాలా ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు తెలుగు టైటాన్స్ కోచ్ క్రిషన్ కుమార్ హుడా. 9 సీజ‌న్ల‌ తర్వాత ప్లే ఆఫ్ లోకి వెళ్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తొలిసారి సెమిస్ చేరాం.. దీన్ని ఎవరు ఊహించలేదని కాస్త ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు క్రిషన్ కుమార్ హుడా. తెలుగు టైటాన్స్ అంటే వస్తుంది అలాగే వెళ్తుంది అని అనుకుంటారు… కానీ మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడని సెమీఫైనల్ చూస్తారని హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ క్వాలిఫైయర్ 2 లో పుణేరి పల్టాన్ తో తెలుగు టైటాన్స్ ఆడనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో గెలిస్తే నేరుగా ఫైనల్ కి వెళుతుంది తెలుగు టైటాన్స్.

Also Read: Indian Team: ఎముక‌లు కొరికే చ‌లిలో టీమిండియా ప్రాక్టీస్‌.. చేతులు ప‌గిలిపోతున్నాయి.. వీడియో వైర‌ల్‌

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×