IND VS AFG: టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య ప్రస్తుతం మూడు టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టి 20 సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్లు ఫినిష్ అయ్యాయి. రెండింటిలో టీమ్ ఇండియా విజయం సాధించి టైటిల్ కూడా గెలుచుకుంది. ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య చిట్టచివరి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో, ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించి వైట్ వాష్ చేసే దిశగా అడుగులు వేస్తోంది టీం ఇండియా. అటు ఒక్క మ్యాచ్ అయిన గెలిచి, పరువు కాపాడుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ ట్రై చేస్తోంది.
టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య జరుగుతున్న మూడు టి20 సిరీస్ నేపథ్యంలో బీసీసీఐకి ఒక్క రూపాయి రాలేదు. కానీ ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఈ సిరీస్ కారణంగా లాభపడింది. ఈ సిరీస్ కోల్పోయినప్పటికీ కూడా, దాదాపు 50 కోట్ల ఆదాయం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు జేబులో పడింది. దీనికి ప్రత్యేక కారణం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా టీ20 సిరీస్ కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యమిచ్చింది. ఇండియాలో ఈ సిరీస్ జరిగినప్పటికీ.. ఆతిథ్య జట్టుగా ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. ఇలాంటి క్రమంలో ఈ సిరీస్ ద్వారా వచ్చిన డబ్బులు అన్ని ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డుకు దక్కనున్నాయి. దాదాపు 50 కోట్ల రూపాయలు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ డబ్బుతో ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు… తమ దేశంలో మైదానాలను రిపేర్ చేయించుకోబోతోంది. అలాగే తమ జట్టుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసుకోనుంది.
టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు టి20 సిరీస్ ప్రసార హక్కులను సోని స్పోర్ట్స్ అలాగే ఫ్యాన్ కోడ్ దక్కించుకున్నాయి. ఇలాంటి క్రమంలో ఈ ప్రసార హక్కులకు సంబంధించిన డబ్బులను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుకు కట్టాల్సి ఉంటుంది. ఇందులో ఒక్క రూపాయి కూడా బీసీసీఐకి దక్కబోవు అన్నమాట. ఈ క్రమంలో టీమిండియా కు ట్రోఫీ తప్ప రూపాయి మిగలలేదని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.