Shoaib Akhtar On Harbhajan: పాకిస్తాన్ డేంజర్ బౌలర్ షోయబ్ అక్తర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు బ్యాటర్లను గడగడలాడించేవాడు ఈ రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ఈ షోయబ్ అక్తర్, ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ రిటర్మెంట్ లైఫ్ లో క్రికెట్ విశ్లేషణ చేస్తూ టీవీ షోలలో సందడి చేస్తున్నాడు. అయితే అలాంటి షోయబ్ అక్తర్.. హర్భజన్ సింగ్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హర్భజన్ సింగ్ ఇప్పటికి తనతో స్నేహం చేస్తున్నాడని… తన కుటుంబ సభ్యులకు మ్యాచ్ టికెట్లు కూడా అందించాడని బాంబు పేల్చాడు. ఒక ఫోన్ చేయగానే, తనకు సహాయం చేసిన గొప్ప వ్యక్తి అని హర్భజన్ సింగ్ ను మెచ్చుకున్నారు. ఇండియాకు వెన్నుపోటు పొడిచి, నాకు సాయం చేశాడు అంటూ కామెంట్స్ చేశారు. 2011 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా జరిగిన సంఘటనను గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు షోయబ్ అక్తర్ (shoaib akthar). దీం తో ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
2011 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో టీమిండియా రెండవసారి ఛాంపియన్ అయింది. ఫైనల్స్ లో శ్రీలంకను చిత్తుగా ఓడించి.. టైటిల్ గెల్చుకుంది ఈ టీం ఇండియా. అయితే ఇదే వన్డే వరల్డ్ కప్ సందర్భంగా సెమీ ఫైనల్ లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైట్ జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా అవలీలగా మ్యాచ్ గెలిచింది. దీనిపై తాజాగా షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
2011 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సెమిస్ జరిగితే హర్భజన్ సింగ్ తనకు సహాయం చేశాడని గుర్తు చేశారు. ఆ వరల్డ్ కప్ సందర్భంగా, తన కుటుంబ సభ్యులకు ఐదు టికెట్లు ఇప్పించాలని హర్భజన్ సింగ్ ను కోరినట్లు గుర్తు చేశారు. దానికి వెంటనే రియాక్ట్ అయిన హర్భజన్ సింగ్… నా కుటుంబ సభ్యులకు ఐదు టికెట్లు ఇప్పించాడని వివరించారు. ప్రత్యేకంగా వాళ్లకు ఫ్లైట్ టికెట్లు కూడా అతడే బుక్ చేశాడని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులు అందరూ కలిసి మ్యాచ్ తిలకించి.. ఎంజాయ్ చేశారని గుర్తు చేశారు. దీంతో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.